కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రగతి భవన్ పిలుపు నేపథ్యంలో కాంగెస్ కీలక నేతలను ఎక్కడికక్కడ గృహనిర్భంధంలో ఉంచిన పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించగా, వారిని తలదన్నె రీతిలో వ్యవహరించిన పలువురు కాంగ్రెస్ నేతలు పటిష్టమైన బందోబస్తును కాలరాస్తూ నేరుగా ప్రగతి భవవన్ చేరకుని తమ నిరసనను వ్యక్తం చేశారు. ప్రగతి భవన్ ను ముట్టడించేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ పై వచ్చిన ఆయనను ఆపేసి, అదుపులోకి తీసుకున్నారు. ప్రగతి భవన్ వద్ద నుంచి బలవంతంగా పోలీసు వాహనంలో తరలించారు. ఈ సందర్భంగా పోలీసులతో రేవంత్ వాగ్వాదానికి దిగారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్న కేసీఆర్ నశించాలి అంటూ నినదించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే చర్చలు జరపాలని, ప్రాణాలు అర్పించిన కార్మికుల కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను సవాల్ చేస్తూ ప్రగతి భవన్ గేట్లను తాకుతామని ఛాలెంజ్ చేసి తాకామని చెప్పారు. రేపు కేసీఆర్ ప్రగతి భవన్ గోడలను 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు బద్దలు కొట్టడం ఖాయమని అన్నారు.
జూబ్లిహిల్స్ లోని తన నివాసం నుంచి ప్రగతి భవన్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఇక్కడి సమీపంలోని ఓ హోటల్కు చేరుకుని, ఓ ఆటోలో ప్రగతి భవన్ కు బయలుదేరారు. అయితే, అంతలోనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్ వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. న్యాయస్థాన ఆదేశాలను కూడా సర్కారు లెక్కచేయట్లేదన్నారు.
ఈ వైఖరితో జనాల్లోకి సర్కారు తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కార్మికులతో చర్చలు జరపాలని కోర్టు ఆదేశించినా, దానిని సైతం ధిక్కరించి ముఖ్యమంత్రి కేసీఆర్ తానో నియంతను అన్నట్లు వ్యవహరిస్తున్నారని, ఆయన అహంకారం ఏ స్థాయిలో ఉందో ఆర్టీసీ సమ్మెతో బయటపడిందని కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఆర్టీసీ ఉద్యమం ఇప్పటికే తీవ్ర స్థాయికి చేరిందని, అరెస్టులతో దాన్ని అడ్డుకోవాలని కేసీఆర్ ప్రయత్నించడం వృథా ప్రయత్నమన్నారు. నేడు ప్రగతి భవన్ ముట్టడికి కాంగ్రెస్ పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు, పార్టీ నాయకులను ఎక్కడికక్కడ గృహనిర్బంధం చేశారు. ఈ సందర్భంగా షబ్బీర్ మాట్లాడుతూ ప్రభుత్వం తీరు మారకుంటే రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం వచ్చితీరుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉందని జోస్యం చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more