ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున .. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అయితే ఈ భేటీపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. సినీ పరిశ్రమ వారు.. నేరస్థులతో కలవడం మంచిది కాదన్నారు. జగన్, నాగార్జున భేటీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అనేకమంది ఎమ్మెల్యేలు... ఎంపీలు.. టీడీపీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగన్ తో నాగార్జున భేటీ కావడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తనదైన శైలిలో సీరియస్ అయ్యారు.
జగన్ అక్రమాస్థుల కేసులో నిందితుడని, అలాంటి నేరస్థులతో ... సినిపరిశ్రమకు చెందిన వారు అందులోనూ అగ్రహీరోగా పేరొందినవారు కలవడం అంత మంచిది కాదని హితవు పలికారు. సినీ హీరో నాగార్జున వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవడం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆయన రాజకీయాల్లోకి వస్తారని జోరుగా ప్రచారం జరిగింది. అదే సమయంలో తన కోసం కాకుండా తన మిత్రుడికి గుంటూరు టికెట్ గురించి చర్చించేందుకు జగన్ మోహన్ రెడ్డికి కలిశారని రాజకీయవర్గాల్లో చర్చ జరిగింది.
అయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ జగన్ ఎందుకు కలిశారనే అంశంపై మీడియాకు ఆయన క్లారిటీ ఇచ్చారు. జగన్ మా కుటుంబ సన్నిహితుడు.. అందుకే ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశానన్నారు నాగార్జున. పాదయాత్ర విజయవంతంగా పూర్తి చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. ఎవరికో టికెట్ విషయంలో నేను జగన్ ను సంప్రదించలేదన్నారు నాగర్జున. అయితే గత 20 ఏళ్లుగా అన్నపూర్ణ స్టూడియో వ్యవహారాలు చూస్తున్న వెంకటేశ్వరరావు అనే వ్యక్తి కోసం నాగార్జున జగన్ ను కలిసినట్టు ప్రచారం జరిగింది. నిజానిజాలు వెల్లడయ్యేందుకు ఎన్నికలు ఆసన్నమయ్యే సమయం వరకు వేచిచూడాల్సిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more