బెంగళూరులో జరుగుతున్న విమానయాన ప్రదర్శనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఏరో ఇండియా 2019 ఎయిర్ షో రిహార్సల్స్ లో ప్రమాదం చోటుచేసుకుని కో-పైలెట్ మృతి చెందాడు. రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానున్న ఏరో ఇండియా 2019 ఎయిర్ షో కోసం ఇవాళ వాయుసేన రిహార్సల్స్ చేస్తుండగా, ప్రమాదం సంభవించింది. భారత వాయుసేన విమానాలు విన్యాసాలు చేస్తున్న వేళ, గాల్లో రెండు విమానాలు ఢీకొన్నాయి.
రెండు విమానాల్లో ఇద్దరు పైలెట్లు ఉన్నారు. అందులోని ఒక విమానంలో కో-పైలెట్ కూడా వున్నాడు. అయితే, గాల్లో విమానాలు ఢీకొన్న వెంటనే ఇద్దరు పైలెట్లు వెంటనే సీట్ ఎజెక్ట్ సిస్టమ్ ద్వారా దూకేసి సురక్షితంగా ల్యాండ్ అయ్యారురు. కాగా, కోపైలెట్ ప్రాణాలు కోల్పోయాడు. ఓ పౌరుడు గాయపడినట్టు బెంగళూరు పోలీసులు తెలిపారు. విమాన శకలాలు ఇస్రో లేఅవుట్ వద్ద పడ్డాయి. వాటిని తొలగించేందుకు చర్యలు చేపట్టారు.
ఇవి రెండూ హక్ ట్రయినర్ జెట్ విమానాలని, సూర్యకిరణ్ ఏరోబెటిక్ టీమ్ లో భాగంగా ప్రదర్శనలో పాల్గొంటున్నాయని, గాల్లో ఢీకొన్న విమానాలు నిర్మానుష్య ప్రాంతంలో కూలడంతో ప్రాణనష్టం తప్పిందని అధికారులు తెలిపారు. ఈ ఘటన తరువాత ఎయిర్ షో రిహార్సల్స్ ను అధికారులు నిలిపివేశారు. అధికారికంగా రేపటి నుంచి ఐదు రోజుల పాటు ప్రదర్శన జరుగనుండగా, నేడు రిహార్సల్స్ జరుగుతున్నాయి.
#WATCH Two aircraft of the Surya Kiran Aerobatics Team crash at the Yelahanka airbase in Bengaluru, during rehearsal for #AeroIndia2019. More details awaited. pic.twitter.com/kX0V5O0n6R
— ANI (@ANI) February 19, 2019
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more