ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ అరాచకానికైనా సమర్ధుడేనని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోద్రాలో 2 వేల మంది ఊచకోతను ఎవరూ మర్చిపోలేరని వ్యాఖ్యానించారు. పుల్వామా దాడిపై అనుమానాలు ఉన్నాయంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై దేశంలో చర్చ జరుగుతోందని ఏపీ సీఎం అన్నారు. దేశభద్రత విషయంలో టీడీపీ రాజీపడబోదన్న చంద్రబాబు.. రాజకీయ లబ్ధి కోసం దేశాన్ని తాకట్టుపెట్టడాన్ని సహించబోమని స్పష్టం చేశారు.
విదేశాలు కూడా మోదీని బాయ్కాట్ చేశాయన్న సంగతిని గుర్తిచేశారు. ప్రధానమంత్రి అయిన తరువాతే మోడీని అగ్రదేశాలు పర్యటనకు అనుమతించాయని, అప్పటి వరకు ఆయనను ముఖ్యమంత్రి హోదాలో కూడా తమ దేశంలోకి అడుగుపెట్టనీయలేదని చెప్పారు. బీజేపీ రాజకీయాలతోనే సరిహద్దుల్లో సంక్షోభం నెలకొందని చంద్రబాబు అన్నారు. అయితే పుల్వామా దాడి జరిగిన నేపథ్యంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారనే చర్చ జరుగుతోంది.
మరోవైపు టీడీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలతో జగన్మోహన్ రెడ్డిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిందని చంద్రబాబు అన్నారు. హైదరాబాద్లో కూర్చుని కేసీఆర్తో కలసి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరంపై కేసులు వేసిన వారితో వైసీపీ లాలూచీ పడుతోందని, వాళ్ల కుట్రలు నెరవేరితే ఏపీకి నీళ్లు కూడా రావని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం వెనుక తెలంగాణ సీఎం కేసీఆర్ కుట్ర ఉందని సంచలన విమర్శలు చేశారు.
ఫిరాయింపులను కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని, జగన్ తో కలిసి ఏపీ అభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన లక్ష్యమని నిప్పులు చెరిగారు. ఇలా చేరడం వల్ల తెలంగాణలో వారి ఆస్తులకు ఆయనే పూచి ఇస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని రైతులంతా స్వాగతిస్తున్నారని, ఇప్పటికే రైతుల ఖాతాల్లో రూ. 1000 జమ చేశామని చంద్రబాబు చెప్పారు. పేదల సంక్షేమ పథకాల విషయంలో ఏపీ రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఏపీలో ప్రాజెక్టులను అడ్డుకుంటున్న వారితో జగన్ చేతులు కలిపారని, ఈ కుట్రదారులకు ప్రజలే గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more