కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వానికి మిత్రపక్షంగా వ్యవహరిస్తున్నా.. ఎప్పటికప్పుడు ప్రధాని నరేంద్రమోడీ పాలనపై బీజేపి వ్యవహరతీరుపై ఘాటైన విమర్శలు చేస్తున్న శివసేన తాజాగా యూ-టార్న్ తీసుకుంది. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఉంటే ఎన్డీయేలో తాము భాగస్వామ్యం కాబోమని తేల్చిచెప్పిన శివసేన.. తన పంథాను మార్చుకుంది. ప్రధానిగా మోడీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన శివసేన.. తన ధోరణి మార్చుకుని ఇక బీజేపితో జతకట్టే సార్వత్రిక ఎన్నికలకు వెళ్లనుంది.
మహారాష్ట్రలో బీజేపీ-శివసేన మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఎట్టకేలకు కొలిక్కివచ్చింది. ఉన్నతస్థాయి సమావేశంలో బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, కేంద్రమంత్రి పియూష్ గోయల్, ప్రకాష్ జావదేకర్ లతో జరిగిన సమావేశంలో తరువాత వీరంతా కలసి ‘శివసేన’ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లి.. సార్వత్రిక ఎన్నికలలో సీట్ల సర్దుబాటు విషయమై కూలంకుషంగా చర్చించారు. అనంతరం ఈ మేరకు మహా సీఎం ఫడ్నవీస్ ఆ వివరాలను మీడియాకు తెలిపారు.
రానున్న లోక్ సభ, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలో శివసేనతో కలిస బీజేపి పోటీ చేస్తామని ఆయన వెల్లడించారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్థానాల్లో, శివసేన 23 స్థానాల్లో పోటీ చేస్తాయని చెప్పారు. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధించి అధికారంలో కొస్తుందని ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. కాగా ఈ సందర్భంగా అయోధ్యలో రామ మందిరం నిర్మించాలన్న ఉద్దవ్ థాక్రే డిమాండ్ కు తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. మహారాష్ట్రకు సంబంధించిన విషయాల్లో శివసేన చేసిన కొన్ని డిమాండ్లకు తాము అంగీకరించినట్టు ఫడ్నవీస్ వివరించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more