బీజేపి అమలుపరుస్తున్న రాజకీయ స్ట్రాటజీ దేశ ప్రజలను ఆకట్టుకోవడం సంగతి అటుంచితే.. వారిలో కొన్ని వర్గాలను మాత్రం భయాందోళనకు గురిచేసేలా వుందన్న విమర్శలు ఇప్పటికే పలురంగాల ప్రముఖుల నుంచి.. ఇటు రాజకీయా పార్టీల నుంచి కూడా వినిపిస్తుంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికలకు వెళ్లేందుకు సమాయత్తం అవుతున్న క్రమంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో తమ అధిపత్యం ప్రదర్శించాలని ఓ వైపు బీజేపి అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు బీజేపి నేతలు మాత్రం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.
తాజాగా, ఉత్తరప్రదేశ్ కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే విక్రమ్ సైనీ కూడా అదే బాటలో నడిచారు. భారత్ లో భద్రత కరవయిందని చెప్పేవారిని బాంబులతో లేపేయాలని వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్నారని తెలిపారు. కానీ కొందరు ద్రోహులు మాత్రం భారత్ లో రక్షణ లేదంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లంతా ఎక్కడ క్షేమంగా ఉంటామని భావిస్తారో, అక్కడికే వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.
లేదంటే తనకు హోంశాఖ ఇవ్వాలనీ, ఒకవేళ తనకు హోంశాఖ ఇస్తే ఇలా మాట్లాడుతున్న వారందరినీ బాంబులతో లేపేస్తానని హెచ్చరించారు. బీజేపీ తప్ప మిగతా పార్టీలన్నీ వందేమాతరం గీతాలాపనను విస్మరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ సెక్రటేరియట్ లో వందేమాతరం ఆలాపనపై సంప్రదాయాన్ని కాంగ్రెెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని తప్పుపట్టారు. చివరగా ఇదంతా తన వ్యక్తిగత వ్యాఖ్యలనీ, దీనికి పార్టీతో సంబంధం లేదని స్పష్టం చేశారు.
#WATCH Vikram Saini, BJP MLA from Muzaffarnagar says 'My personal view is that those who say they feel unsafe and threatened in India should be bombed, give me a ministry and I will bomb all such people, not even one will be spared' pic.twitter.com/E9yWNH7MBF
— ANI UP (@ANINewsUP) January 4, 2019
కాగా, విక్రమ్ సైనీకి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు. గత ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఓ బహిరంగ కార్యక్రమంలో మాట్లాడుతూ తన భార్య ఇద్దరు పిల్లలు చాలు అన్న క్రమంలో జనాభా నియంత్రణకు అనుకూలంగా ఓ చట్టం అమల్లోకి వచ్చేంత వరకు తాను తన భార్యను పిల్లలను కంటూనే వుండాలని చెప్పానని అన్నారు. ఇక ఆ తరువాత న్యూఇయర్ వేడుకలు హిందువులు జరుపుకోవడంపై కూడా మండిపడ్డ ఆయన.. న్యూఇయర్ వేడుకలను క్రిస్టియన్లు జరుపుకుంటారని అది భారత సంప్రదాయం కాదని అగ్గిరాజేశారు.
విక్రమ్ సైని వ్యాఖ్యలు ఉగ్రవాదిలా వున్నాయని ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వారిని చంపండీ అంటూంటే.. మంత్రి పదవిపై కన్నేసిన ఆయన ఎమ్మెల్యే ప్రజలపై బాంబులేస్తామని బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తక్షణం యోగీ ప్రభుత్వం సైనీని అరెస్టు చేసి శిక్షించాలని అన్నారు. ఆయన తీవ్రవాదిలా వ్యవహరిస్తున్న క్రమంలో ఆయన వెనుక ఏవైనా ఉగ్రవాదశక్తులు వున్నాయా అన్నకోణంలోనూ విచారణ జరిపించాలని రాజ్ బబ్బర్ డిమాండ్ చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more