రైతుల కళ్లలో ఆనందం నింపుతామని, వారి ఆదాయన్ని ఏడాదిలోగా రెండింతలు చేస్తామని గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన బీజేపి అధికారంలోకి వచ్చి ఐదేళ్లు కావస్తున్నా.. రైతుల గురించి మాత్రం పట్టించుకోవడం లేదనడానికి ఇది మరో సాక్ష్యం. దేశ సర్వన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇప్పటికే రైతుల విషయంలో కేంద్రానికి పలుమార్లు మొట్టికాయలు వేసినా.. నష్టపరిహారం చెల్లించాలని చెప్పినా పెడచెవిన పెట్టిన కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా రైతులు మండిపడుతున్నారు.
ఇక తమ పంటలకు కూడా గిట్టుబాటు ధర రాక కడుపు మండిన రైతులు తమ నిరసనను ఏకంగా ప్రధాని మోడీకే రుచిచూపిస్తున్నారు. మొన్నటికి మొన్న నాసిక్కు చెందిన ఓ ఉల్లి రైతు 750 కేజీల ఉల్లి అమ్మితే కేవలం వెయ్యి రూపాయలు లాభం వచ్చిందని బాధపడి.. దాన్ని ప్రధాని మోదీకి మనీ ఆర్డర్ చేశాడు. తాజాగా ఆ జాబితాలో మరో రైతు చేరాడు. ఈ సారి ఉల్లి రైతు కాదు. ఆలూ రైతు. యూపీలోని ఆగ్రా జిల్లాకు చెందిన ప్రదీప్ శర్మ అనే రైతు కూడా ఇదే విధంగా తన నిరసనను వ్యక్తం చేశారు.
కొన్ని రోజుల క్రితం 19,000 కేజీల బంగాళాదుంపలను మార్కెట్లో అమ్మాడు. అందుకుగాను అతడికి రూ.94,677 వచ్చింది. అందులో లోడింగ్, అన్ లోడింగ్ ఖర్చులు, కమీషన్లు, హమాలీల కూలీలు, ఇతర చిల్లర ఖర్చులు కలిపి రూ.48,187 బిల్లు అయింది. ఇంక మిగిలింది రూ.46,490. అందులో ఆలుగడ్డను కోల్డ్ స్టోరేజీలో కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచినందుకు అయిన బిల్లు రూ.46,000. అది కూడా తీసేస్తే రైతుకు వచ్చిన లాభం రూ.490.
పది ఎకరాలు సాగు చేసి, కూలీలకు డబ్బులు పెట్టి, శ్రమకోర్చి మార్కెట్కు సరుకు తీసుకొస్తే కేవలం రూ.490 లాభం రావడాన్ని చూసిన ఆ రైతు కడుపు తరుక్కుపోయింది. ఆ డబ్బులను ప్రధాని మోదీకి మని ఆర్డర్ చేశాడు. అయితే, ప్రధాని మోదీని నిందించడానికి, అపహాస్యం చేయడానికి తాను మనిఆర్డర్ చేయలేదని, రైతులకు ప్రధాని చేయాల్సింది ఎంతో ఉంది అని చెప్పడానికే తాను ఈ పనిచేసినట్టు ప్రదీప్ శర్మ తెలిపాడు.
ప్రదీప్ శర్మకు ఇలాంటి అనుభవం ఇదే మొదటిసారి కాదు. గత నాలుగేళ్ల నుంచి ఇదే పరిస్థితి ఎదురవుతోంది. మద్దతు ధర లేక ఆలూ రైతులు పడుతున్న బాధల మీద గతంలో కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని మోదీకి ప్రదీప్ శర్మ పలుమార్లు లేఖలు రాశాడు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మను కూడా కలిశాడు. అయితే, అంతా వృధా ప్రయాసే అయింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more