అయోధ్య రామజన్మభూమి వివాదం గురించి త్వరగా విచారణ చేపట్టాలంటూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం సోమవారం మరోసారి తోసిపుచ్చింది. దీనికి సంబంధించి వచ్చే జనవరి మొదటి వారంలో ప్రత్యేక ధర్మాసనం విచారణ చేపడుతుందని గతంలో తెలిపామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిక్ ఎస్కే కౌల్తో కూడిన ధర్మాసనం పేర్కొంది. దీనిపై ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశామని, వచ్చే జనవరిలో విచారణకు వస్తుందని స్పష్టం చేసింది.
అయోధ్య వివాదంపై త్వరగా విచారణ చేపట్టాలని కోరుతూ అఖిల భారత హిందూ మహాసభ తరఫున న్యాయవాది బరూన్ కుమార్ సిన్హా దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. యూపీ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్లు తమ వాదనలు వినిపిస్తూ..దీర్ఘకాలంగా కొనసాగుతోన్న ఈ వివాదాన్ని సత్వరమే పరిష్కరించడానికి త్వరగా విచారణ చేపట్టాలని కోరారు.
అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను అక్టోబరు చివరి వారంలో విచారించిన త్రిసభ్య ధర్మాసనం, ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీచేయడానికి నిరాకరించింది. మసీదు ఇస్లాంలో భాగం కాదన్న 1994 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పును పునఃసమీక్షించాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. ఇది కేవలం భూ వివాదం మాత్రమేనని స్పష్టం చేసింది.
వివాదం పూర్వాపరాలు అధారంగా దీనిని సివిల్ కేసుగా పరిగణిస్తున్నట్టు నాటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. అలాగే ఇది గత తీర్పునకు సంబంధించిన అంశం కాదని పేర్కొంది. అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మొత్తం 14 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. వీటిలో నాలుగు భూవివాదం కేసులుగా నమోదయ్యాయి. మొత్తం 2.77 ఎకరాల భూమిని మూడు సమాన భాగాలుగా చేసి, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిరోమోహీ అఖరా, రామ్ లల్లాలకు పంచిపెట్టాలని అలహాబాద్ హైకోర్టు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more