దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పును అనుసరించి బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై ఆధార్ నమోదు, అప్డేట్ సేవలను నిలిపివేయాలని యుఐడిఎఐ నిర్ణయించింది. విశిష్ట ప్రాధికార గుర్తింపు సంఖ్య ఇచ్చే ఆధార్ సంస్థ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆధార్ నెంబరును బ్యాంకులు, పోస్టాఫీసులు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అనుసంధానం కొనసాగిస్తే అందుకు ఆధార్ బాధ్యత లేదని స్పష్టం చేసింది.
ఇప్పటికీ కొందరు సేవల కల్పన సంస్థలు ఎలాంటి ధృవీకరణ లేకుండా యునిక్ ఐడిని వినియోగించి ఆఫ్ లైన్ పరిశీలన చేయవచ్చునని కూడా న్యాయస్థానం సందేహాలను వ్యక్తం చేసింది. అత్యున్నత న్యాయస్థానం ఇప్పటికే ఆధార్ బ్యాంకు ఖాతాలను ప్రారంభించేందుకు తప్పనిసరి కాదని పేర్కొంది. బ్యాంకులు, పోస్టాఫీసులకు అమలుచేస్తున్న నిబంధనలను అనుసరించి ఆధార్ నమోదు, మార్పులు, చేర్పులు సేవలను ఇకపై నిలిపివే యాలని సూచించింది.
చిరునామా ధృవీకరణ, వ్యక్తి ధృవీకరణకు ఇవి భిన్నంగా ఉంటాయని వెల్లడించింది. యుఐడిఎఐ సిఇఒ అజయ్ భూషణ్ పాండే మాట్లాడుతూ ఆఫ్ లైన్ మోడ్ లో ఆధార్ ను వినియోగిస్తున్నారని, పాన్, ఐటిఆర్, నేరుగా లబ్ది బదిలీ వంటి ప్రభుత్వ పథకాలకు ఆధార్ ను ప్రభుత్వమే రాజ్యాంగబద్ధం చేసిందని, ఆధార్ మొత్తం ప్రక్రియలో బ్యాంకులు కీలకంగా ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు.
అందువల్ల తీర్పునకు ముందే బ్యాంకులు, పోస్టాఫీసులు ఆధార్ లింకింగ్ చేపట్టినందున తాజా నిబంధనలకు అనుగుణంగా మార్చాల్సి ఉంటుందని పాండే వెల్లడించారు. ధృవీకరణ సేవలకు, ఆధార్ అప్డేట్, ఎన్రోల్స్మెంట్కు తేడా ఉందని పేర్కొన్నారు. యుఐడిఎఐ ఆధార్కేంద్రాలను పునర్వ్యవస్థీకరిస్తోందని, అందువల్ల బ్యాంకు ఖాతాలు ఆధార్ధృవీకరణను వినియోగిం చకూడదని ఆయన సూచించారు.
బ్యాంకులు పోస్టాఫీసులు సైతం దేశవ్యాప్తంగా 13వేల కేంద్రాలకుపైగా వీటిని ఏర్పాటుచేసారు. మరికొన్ని కేంద్రాలను ఆధార్ప్రారంబిస్తుందని అన్నారు. ఇప్పటికిప్పుడు మాత్రం బ్యాంకులు కొనసాగించే ఎన్రోల్మెంట్, అప్డేషన్ కార్యకలాపాలకు తమనిబంధనల్లో ఎలాంటి మార్పులులేవని ఆయనఅన్నారు. ఇ-ఆధా ర్, క్యూఆర్ అంటే క్విక్రెస్పాన్స్ కోడ్ ఆధారంగా ఎలాంటి దృవీకరణలేకుండా ఆధార్ను వినియోగిస్తున్నారని, బయోమెట్రిక్స్ లేదా 12 అంకెల నంబరును వినియోగిస్తున్నారని వెల్లడించారు.
కేవలం నమోదు, మార్పులకు మాత్రమే వినియోగిస్తన్నారని పాండే వెల్లడించారు. ఇటీవలి తన తీర్పులో రాజ్యాంగ బద్ధతను గుర్తిస్తూనే ఆధార్ బయోమెట్రిక్ గుర్తింపు ప్రాజెక్టును బ్యాంకులు, మొబైల్ కనెక్షన్లు, పాఠశాలల్లో ప్రవేశాలకు నిర్బంధం చేయడం వీలుకాదని వెల్లడించింది. అయితే ఆధార్ ను సంక్షేమ పథకాలకు వినియోగించవచ్చని, ఎలాంటి గోప్యత ఉల్లంఘన లేదని ఐదుగురు సభ్యుల అతున్నత్య ధర్మాసనం తీర్పును వెలువరించింది. పాన్, ఐటిఆర్ లలోను ఆధార్ ను విధిగా వేయాల్సిందేనని, చెపుతూనే కోర్టు ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను రద్దు చేస్తూ.. ప్రైవేటు సంస్థలు అధార్ డేటాను వినియోగించరాదని పేర్కోంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more