జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్ రోడ్డులో సంభవించిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 63కు చేరింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొడిమ్యాల మండలం తిర్మలాపూర్ గ్రామానికి చెందిన ఆరెపెల్లి లింగవ్వ(70) కరీంనగర్ లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. లింగవ్వ మృతితో బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 63కు చేరింది. ఇదిలా వుంటే ఈ ప్రమాదం జరిగి దాదాపుగా నెల రోజులు కావస్తున్నా.. బాధిత కుటుంబాలకు మాత్రం ఒక్క రూపాయి కూడా పరిహారం లభించలేదు.
ప్రమాదంలో మృతులు కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారంతో పాటు గాయపడిన వారికి రూ.రెండున్నర లక్షల పరిహారం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం ప్రకటన చేసిన క్రమంలో తమకు చికిత్స నిమిత్తం డబ్బులు వస్తాయని వేచిచూసిన బాధితులకు నెల రోజులు కావస్తున్నా ఒక్క రూపాయి కూడా పరిహారం అందలేదు. అయితే తాజాగా ఎన్నికల కోడ్ అమల్లో వుందన్న సమాచారంతో ప్రభుత్వం ఈ ఫైల్ పై సంతకాలు పెట్టలేదని తెలుస్తుంది. అయితే అంతకుముందే ఈ ఫైల్ పై సంతకం పెట్టివుంటే.. బాధితకులకు అసరాగా వుండేదన్న పలు సూచనలు కూడా వినిపిస్తున్నాయి.
గత నెలలో శాసనమండలికి అపధర్మ ముఖ్యమంత్రి హోదాలో హాజరైన సీఎం కేసీఆర్.. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్ సేవలను గుర్తించి ఆయనకు ఏకరం స్థలంలో స్మారక చిహ్నం ఏర్పాటు చేస్తామని ప్రకటించిన క్రమంలో నిద్రలేచిన ఎన్నికల కమీషన్.. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో వుందని చెప్పింది. అప్పటి వరకు ప్రభుత్వం తమకు కావాల్సిన పనులను చక్కబెట్టుకుంది. అయితే అదే సమయంలో కొండగట్టు బాధితుల ఫైల్ పై కూడా కేసీఆర్ సర్కార్ సంతకం చేసివుండి వుంటే బాధితులకు ఇంత అంగలార్పు వుండేది కాదన్న గుసగుసలు కూడా వినబడుతున్నాయి.
జాప్యానికి అసులు కారణమేంటీ.?
ఈ ప్రమాదానికి సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టర్ గత నెల 19న రాష్ట్ర సచివాలయానికి పంపారు. ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ ద్వారా ఆపద్బంధు కింద రూ.50 వేలు మాత్రమే చెల్లించే వెసులుబాటు ఉండటంతో ఆ దస్త్రాన్ని సీఎం సహాయ నిధికి పంపించారు. అప్పటి నుంచి దస్త్రం ఆ విభాగంలోనే ఉండిపోయింది. పరిహారం మంజూరీ ఉత్తర్వులపై సీఎం సంతకం చేయాల్సి ఉండగా ఎన్నికల నియమావళి(కోడ్) అడ్డంకిగా మారిందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెల 11తో ఈ ప్రమాదం జరిగి నెల రోజులు పూర్తవుతుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more