మొన్న ఈ మధ్యే ఉత్తరభారతావనిలో పోలీసు కానిస్టేబుల్ చిన్నారి చంటిబిడ్డను లాలించి.. తల్లి కోసం అంగలార్చకుండా చేసిన ఘటన వైరల్ గా మారింది. అయితే అక్కడే కాదు ఇక్కడ మన రాష్ట్రంలో అందులోనూ హైదరాబాద్ మహనగరంలోని పోలీసులు కూడా అందరి మనస్సులను గెలుచుకున్నారు. తబలొ కూడా మంచితనానికి కొదవ లేదని.. రుజువు చేసుకున్నారు. ఎంతలా అంటే ఇప్పుడు వారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంత.
నమ్మశక్యంగా లేదా.? కానీ ఇది నిజం. ఓ తల్లి తన ఆరు మాసాల చంటి బాబును ఎత్తుకుని పరీక్షా కేంద్రానికి వచ్చి గ్రూప్ 4 పరీక్ష రాసేందుకు వెళ్లింది. అయితే చంటిబిడ్డ కూడా వుండటంతో అమె తన వెంట తన చెల్లిని కూడా తెచ్చుకుంది. ఇక పరీక్ష రాసేందుకు అమె పరీక్షా కేంద్రంలోనికి వెళ్లింది. ఆ తరువాత కొద్ది సేపటికీ ఆ చంటి బిడ్డ తన తల్లి కోసం అంగలార్చుతూ ఏడవడం ప్రారంభించింది. తన పిన్ని ఎత్తుకుని ఎంతగా ఓదార్చినా ఆరు నెలల చంటిబిడ్డ మాత్రం తన తల్లినే కోరుకుంది. అంతే గుండలవిసేలా ఏడుస్తూనే వుంది.
ఈ విషయాన్ని అదే పరీక్షా కేంద్రం వద్దనునున్న జీ జే దివాకర్ అనే కానిస్టేబుల్ సహా ఆరుగురు కానిస్టేబుళ్ల బృందం గమనించింది. వెంటనే వారు చంటిబిడ్డను తమ చేతుల్లోకి తీసుకుని ఓదార్చడం ప్రారంభించారు. ఇక బిడ్డ పాల కోసం ఏడుస్తుందని తెలుసుకున్న పోలీసులు పాలసీసాతో బిడ్డకు పాలు కూడా తాగించారు. చివరకు ఎలాగోలా వారందరూ కలసి బిడ్డను నిద్రలోకి జారుకునేలా చేశారు. ఈ ఘటన హైదరాబాద్ లోని పార్సీ పాఠశాల వద్ద చోటుచేసుకుంది. ఈ వీడియోను కొందరు తమ సెల్ ఫోన్లలో బంధించి.. దానిని నెట్టింట్లో అప్ లోడ్ చేయడంతో అదికాస్తా వైరల్ అయ్యింది. ఈ పోలీసులు కూడా మంచి మనస్సునోళ్లే అంటూ నెట్ జనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more