వాహనదారులకు ఇంధన ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆల్ టైం రికార్డ్ హైకు చేరుకున్న ధరలు మరింత ఎగబాకుతూ శతకంపైవు దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజువారిగా పైసల్లోనే పెరుగుతున్నా.. ఇలాగే మరికోన్ని రోజులు కొనసాగితే.. లీటరు పెట్రోల్ వంద రూపాయలకు చేరుకునే తరుణం అట్టే దూరం లేదనిపిస్తుంది.
వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలను పరిశీంచగా, సెంచరీకి చేరువ కావడానికి కేవలం ఒక నెల రోజులు వ్వవధి సరిపోతుందేమో.. అంటూ వాహనదారులు అందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.56. ఈ రోజే 31 పైసలు పెరిగింది. 44 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.75.54కు చేరింది. ఇండియాలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉండేది ముంబైలోనే. ఇప్పుడు ధర రూ.86.56. అంటే రూ.100 చేరడానికి తేడా రూ.14 రూపాయల్లోపే ఉంది.
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 78.84, కోల్కతాలో రూ.81.76, చెన్నైలో రూ.81.92 , హైదరాబాద్లో 84.10 ధరల్లో ఉన్నాయి. డీజిల్ ధరలు ముంబైలో రూ.75.54, చెన్నైలో రూ.75.19, ఢిల్లీలో రూ.71.15 ధరల్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ 83.59 పైసలుగా వుండగా, అదే ఆంధ్రప్రదేశ్ లో 85.09 రూపాయలుగా నమోదైంది. గత ఐదు నెలల్లో లీటర్ పెట్రోల్పై రూ.4.66, లీటర్ డీజిల్పై రూ.6.35 పెరగడం సామాన్యులపై మోయరాని భారం మోపినట్టైంది. వరుసగా ఎనిమిది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
పెట్రోల్, డీజిల్ ధరలిలా ఆల్ టైమ్ హైతో ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టించడం చూస్తుంటే... ఎప్పటివరకు ఇలా ధరలు పెరుగుతూ ఉంటాయో అన్న ఆందోళన సామాన్యుల్లో కనిపిస్తోంది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటకు తీయాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్పై ధరలు పెరగడం పరోక్షంగా రవాణా రంగంపై పడుతుంది. ఫలితంగా ఆహారపదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more