Petrol and diesel prices running towards hundred ఇంధన ధరలు: శతకం వైపు పరుగులు..

Petrol and diesel prices running towards hundred

oil price, crude oil, price hike, petrol, diesel, dharmendra pradhan, goods and service tax, petrol price, diesel price

Fuel prices have been on a continuous rise recently, it seems that they are running words Rs 100 per litre. Due to which consumers have taken to social media and other platforms to complain of the additional expense.

ఇంధన ధరలు: శతకం వైపు పరుగులు..

Posted: 09/03/2018 05:53 PM IST
Petrol and diesel prices running towards hundred

వాహనదారులకు ఇంధన ధరలు దడ పుట్టిస్తున్నాయి. ఇప్పటికే ఆల్ టైం రికార్డ్ హైకు చేరుకున్న ధరలు మరింత ఎగబాకుతూ శతకంపైవు దూసుకెళ్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రోజువారిగా పైసల్లోనే పెరుగుతున్నా.. ఇలాగే మరికోన్ని రోజులు కొనసాగితే.. లీటరు పెట్రోల్ వంద రూపాయలకు చేరుకునే తరుణం అట్టే దూరం లేదనిపిస్తుంది.

వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలను పరిశీంచగా, సెంచరీకి చేరువ కావడానికి కేవలం ఒక నెల రోజులు వ్వవధి సరిపోతుందేమో.. అంటూ వాహనదారులు అందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.86.56. ఈ రోజే 31 పైసలు పెరిగింది. 44 పైసలు పెరగడంతో లీటర్ డీజిల్ ధర రూ.75.54కు చేరింది. ఇండియాలో పెట్రోల్ ధర ఎక్కువగా ఉండేది ముంబైలోనే. ఇప్పుడు ధర రూ.86.56. అంటే రూ.100 చేరడానికి తేడా రూ.14 రూపాయల్లోపే ఉంది.

ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ. 78.84, కోల్‌కతాలో రూ.81.76, చెన్నైలో రూ.81.92 , హైదరాబాద్‌లో 84.10 ధరల్లో ఉన్నాయి. డీజిల్ ధరలు ముంబైలో రూ.75.54, చెన్నైలో రూ.75.19, ఢిల్లీలో రూ.71.15 ధరల్లో ఉన్నాయి. ఇక హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ 83.59 పైసలుగా వుండగా, అదే ఆంధ్రప్రదేశ్ లో 85.09 రూపాయలుగా నమోదైంది. గత ఐదు నెలల్లో లీటర్ పెట్రోల్‌పై రూ.4.66, లీటర్ డీజిల్‌పై రూ.6.35 పెరగడం సామాన్యులపై మోయరాని భారం మోపినట్టైంది. వరుసగా ఎనిమిది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలిలా ఆల్‌ టైమ్ హైతో ఎప్పటికప్పుడు రికార్డులు సృష్టించడం చూస్తుంటే... ఎప్పటివరకు ఇలా ధరలు పెరుగుతూ ఉంటాయో అన్న ఆందోళన సామాన్యుల్లో కనిపిస్తోంది. పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. బండి బయటకు తీయాలంటేనే వణికిపోవాల్సిన పరిస్థితి. పెట్రోల్, డీజిల్‌పై ధరలు పెరగడం పరోక్షంగా రవాణా రంగంపై పడుతుంది. ఫలితంగా ఆహారపదార్థాలు, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles