ఓ యువతి ఆశలను సజీవ దహనం చేసిన ఆ మగమృగం అదే తప్పును మళ్లీ చేయాలనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న మహిళ.. ఆ యువతి జీవితాన్ని కాపాడటంతో పాటు అసలు ఆ మగమృగం దాచిన గుట్టును కూడా విప్పడంతో.. ఓ సాప్ట్ వేర్ ఇంజనీరు భాగోతం బట్టభయలైంది. పెళ్లంటే నేరేళ్ల పంట అని కోటి ఆశలతో, కొంగ్రొత్త అలోచనలతో భర్తతో తనదైన జీవితాన్ని ఆనందించాలని కలలుగంటూ అత్తవారింట్లోకి అడుగుపెట్టిన ఆ యువతి కాళ్ల పారాణి అరకముందే తాను పెళ్లాడింది ఓ మృగానని తెలుసుకుంది.
శోభనం రోజు రాత్రి తన వికృత చేష్టలతో వ్యవహరించిన భర్తపై అనుమానాలు ఓ వైపు వస్తున్నా.. తొలిరాత్రినే నిలదీయడం బాగోదని మిన్నకుండిపోయిన ఆ వివాహిత భర్తతో సుఖం పంచుకోవడం విషయాన్ని అటుంచితే అమె అందం అడవికాసిన వెన్నెల కాగా, అమె కోరికలు, కలలు, ఉహాలు అన్నీ అదే రోజు రాత్రి పటాపంచలయ్యాయి. అంతేకాదు.. అమెను పూర్తి నగ్నంగా మార్చిన తన భర్త ఫోటోలు, వీడియోలు తీసి.. తన గుట్టును బయటపెట్టడానికి ప్రయత్నిస్తే.. అమెకు చెందిన నగ్న ఫోటోలు, వీడియోలను కూడా అన్ లైన్ లో పెడతానని వార్నింగ్ ఇచ్చాడు. ఇంతకీ ఆ గుట్టేమిటో అర్థమైంది కదూ..
ఆ సాప్ట్ వేర్ ఇంజనీరు.. హార్డ్ వేర్ లో సమస్య ఉత్పన్నమైంది. అతడు నపుంసకుడు. సమాజంలో తాను మగాడిలా వుండాలని పెళ్లి చేసుకున్నాడు.. కానీ ఈ విషయాన్ని కప్పిపుచ్చకోవడానికి నగ్న చిత్రాలు, వీడియోలు అడ్డుపెట్టుకున్నాడు. ఇన్నాళ్లు ఆతని భార్య మౌనంగా వుండిపోయింది. అయితే తాజగా మరో పెళ్లికి సిద్దం అవుతున్న క్రమంలో విషయం తెలుసుకున్న బాధితురాలు.. తనలా మరో యువతి కూడా బలికావద్దని భావించి సాప్ట్ వేర్ ఇంజనీరు అసలు గుట్టును బయటపెట్టింది. వివరాల్లోకి వెళ్తే..
అనంతపురం జిల్లా రాయదుర్గంకు చెందిన యువతికి, హైదరాబాదులో నివాసం ఉంటున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మాచాని రాజేంద్రప్రసాద్ తో గత ఏడాది ఆగస్టు 2న వివాహం అయింది. కట్నంగా 45లక్షల రూపాయలు, వివాహనంతరం మరో 10 లక్షల రూపాయలు ఇచ్చారు. కాగా పెళ్లైన మొదటిరోజే రాజేంద్రప్రసాద్ తేడాగా వ్యవహరించాడు. తాను నపుంసకుడన్న విషయాన్ని ఎవరికైనా చెబితే నగ్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయాన్ని అతడి అమ్మమ్మకు తెలుపగా ఆమె కూడా తన మనవడు నపుంసకుడేనని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించిందని బాధితురాలు తెలిపింది.
అత్తింటి వారి ఆగడాలు భరించలేక బయటకు వచ్చినట్లు బాధితురాలు పేర్కొంది. దీంతో తన నపుంసకత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి బాధితురాలికి టీబీ రోగం ఉందని రాజేంద్రప్రసాద్ ప్రచారం చేశాడు. ‘ఆసుపత్రికి వెళ్లి అన్ని రకాల పరీక్షలు చేయించుకున్నాను. నాకు ఏ రోగం లేదని డాక్టర్లే నిర్ధారించారు. నా భర్తకు పరీక్షలు చేయించమని అత్తింటివారిని అడగ్గా.. అతడు ఎక్కడికి రాడు. ఏం చేసుకుంటావో చేసుకోపో అని బెదిరించారు. అమ్మనాన్నలకు చెప్పి పెద్దల సమక్షంలో నిలదీస్తే ఏమి స్పందించకుండా వెళ్లిపోయారు’అని ఆమె అవేదన వ్యక్తం చేశారు. అతడు మరో పెళ్లికి రెడీ అయ్యాడని, తనలా మరోకరి జీవితం కూడా నాశనం కాకూడదనే తాను ధైర్యం చేసి పోలీసులకు పిర్యాదుచేశానని బాధితురాలు తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more