షుగర్, ఉబకాయం, బిపీ సహా పలు రుగ్మతలను నియంత్రించుకోవడానికి తన సలహాలు, సూచనలు పాటిస్తే చాలునని వీరమాచనేని రామకృష్ణ తనదైన శైలిలో డైట్ ను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే వీరమాచనేని డైట్ పై ఓ వైపు వైద్యులు ప్రజలను హెచ్చరిస్తూ.. ఆయన డైట్ పాటించడం వల్ల మొదటికే ప్రమాదం రావచ్చునని కూడా హెచ్చరించిన నేపథ్యంలో దీనిపై తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఈ క్రమంలో మరో అడుగుముందుకేసిన వీరమాచనేని తన డైట్ పాటించడం వల్ల ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదని ఘంటాపథంగా చెబుతున్నారు. చాలా మంది మేము ఇన్ని కేజీల బరువు తగ్గామని కూడా చెబుతున్నారు.
90 నుంచి 120 రోజుల పాటు ఈ ఆహార నియమాలు పాటిస్తే.. షుగర్ ను పూర్తిగా అరికట్టవచ్చని అంటున్నారు. శాంతా బయోటెక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు వరప్రసాద్ రెడ్డి కూడా ఈ డైట్ తో ఇన్సులిన్ తీసుకోవడం ఆపేశారని వీరమాచనేని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. తాజాగా ఈ విషయమై వరప్రసాద్ ఓ పత్రికకు లేఖ రాశారు. తాను, తన భార్య 80 రోజుల పాటు వీరమాచనేని ఆహార నియమాలను పాటించినట్లు వరప్రసాద్ తెలిపారు. ఈ డైట్ కారణంగా తన భార్యకు మెరుగైన ఫలితాలు వచ్చాయని వెల్లడించారు. ఈ ఆహార నియమాలు తనపై పెద్దగా ప్రభావం చూపలేకపోయానని పేర్కొన్నారు. తన స్పందన కోసం పలువురు ఎదురుచూస్తున్నట్లు తెలియడంతోనే ఈ లేఖ రాస్తున్నానని అన్నారు.
వీరమాచనేని డైట్ లో చెప్పిన విధంగా తామిద్దరం వరి బియ్యం, పప్పులు, పండ్లు, దుంపలు, చక్కెర, బెల్లం భోజనంలో లేకుండా జాగ్రత్త పడినట్లు తెలిపారు. రోజుకు ఆహారంలో 70 గ్రాముల కొబ్బరినూనెతో పాటు, ఆవు నెయ్యి, 2-3 కోడిగుడ్లు తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ సమయంలో ఇన్సులిన్ మాత్రలు, ఇంజెక్షన్లను వాడలేదన్నారు. ఇలా 80 రోజులు పాటించినా ఈ డైట్ తన షుగర్ వ్యాధిపై పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనీ, తన భార్య షుగర్ మాత్రం నియంత్రణలోకి వచ్చిందని వెల్లడించారు. డైట్ పాటించిన కాలంలో తన షుగర్ నిల్వలు 180, 190కి తగ్గలేదని వరప్రసాద్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more