ప్రధాని నరేంద్ర మోడీ 40 ఏళ్ల క్రితం అప్పటి ప్రధాని ఇంధిరాగాంధీ అప్పటి పరిస్థితుల్లో తీసుకున్న ఎమర్జెన్సీ నిర్ణయంతో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని విమర్శించన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై గట్టిగానే సమాధానమిచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని కాపాడడం వల్లే ఒక దేశంలో ఒక సాధారణ చాయ్ వాలా కూడా ఇవాళ ప్రధాన మంత్రి పదవిని అధిరోహించగలిగాడని కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర ఇన్ ఛార్జి మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ముంబయిలో ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఖర్గే ప్రధాని, కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
‘గత 70ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతి కార్యక్రమంలో అడుగుతూ ఉంటారు. మేము దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాము కాబట్టే ఓ చాయ్ వాలా ప్రధాన మంత్రి అయ్యారు.’ అని పేర్కొన్నారు. మాట మాట్లాడితే కాంగ్రెస్ చేసిన పనులను అప్పటి పరిస్థితుల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయాలను ఎత్తి చూపి తప్పిదాలుగా ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకునే ప్రధాని మోదీకి.. కాంగ్రెస్ చేసిన అభివృద్ది.. దేశంలో తీసుకువచ్చిన విప్లవాత్మకమైన మార్పులు మాత్రం కనబడటం లేదని ఆయన చురకలంటించారు.
ప్రధాని మోడీ గత నాలుగేళ్లుగా దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితిని కొనసాగిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు పథకాలపై ఖర్గే విమర్శలు గుప్పించారు. ఆ పథకాలన్నీ విఫలమయ్యాయని దుయ్యబట్టారు. బీజేపి ఉద్దేశపూర్వకంగా ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీ, సోనియాగాంధీల వ్యక్తిత్వాలపై దాడి చేస్తోందని, కాంగ్రెస్ పార్టీ ఓ కుటుంబం వంటిందని, తామంతా అందులో సభ్యులమని వెల్లడించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వ్యవసాయ రంగానికి చెందిన పథకాలు విఫలమవుతున్నాయిన విమర్శించారు. మోదీ ప్రభుత్వం పడిపోతేనే ప్రజలకు ‘అచ్ఛే దిన్’ వస్తుందని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more