దైవాంశ సంభూతులమని చెప్పుకుంటూ అమాయక భక్తులను బురిడీ కొట్టిస్తున్న అనేక మంది మేక తోలు కప్పుకున్న పులిలాంటి బాబాల భాగోతాలు వెలుగుచూస్తున్న క్రమంలో మరో బాబా కూడా అదే బాటలో పయనించాడు. తన భక్తురాలిపై అత్యాచారం చేసి.. తాను పూర్తిగా అమాయకుడినని తప్పించుకోజూస్తున్నాడు. నాగా సెక్టార్ లోని చత్రాపూర్ ఆశ్రమంలో 2016లో దాతీ మహరాజ్ తనపై అత్యాచారం చేశారంటూ భక్తురాలు పోలీసులకు పిర్యాదు చేసింది. తన ప్రాణానికి హాని ఉండడంతోనే ఈ విషయాన్ని ఇంతకాలం బయటపెట్టలేదని పేర్కొంది.
అయితే, అత్యాచారం జరిగిందని బాధితురాలు చెబుతున్న రోజున దాతీ మహరాజ్ అసలు ఆశ్రమంలోనే లేరంటూ ఆశ్రమ అధికారులు పోలీసులకు ఆధారాలు సమర్పించారు. తన వద్ద నుంచి డబ్బు లాగాలనే ఆ భక్తురాలు తనపై ఆరోపణలు చేస్తుందని బాబా భక్తులు వాదిస్తున్నారు. అయితే మాటల్లో నిజమెంత.? నిజాయితీ వుందా.? అన్న విషయాన్ని కూడా పోలీసులు నిర్థారించే పనిలో వున్నారు. కాగా, బాబా తనపై పలుమార్లు అత్యాచారం చేశారని, తన కోరిక తీర్చాలని ఫోన్ చేసి వేధించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో పోలీసులు బాబా మొబైల్ కాల్ డేటాను పరిశీలించాలని నిర్ణయించారు.
ఇక విషయంలోకి వస్తే.. తనపై రెండేళ్ల క్రితం స్వయం ప్రకటిత దైవాంశ సంభూతుడు దాతీ మహరాజ్ అత్యాచారం చేశాడని ఆయన భక్తురాలు అరోపించిన క్రమంలో విచారణకు హాజరైన బాబా తాను అమాయకుడినని పోలీసుల ఎదుట వివరణ ఇచ్చాడు. అయితే తన వద్ద నుంచి డబ్బు లాగేందుకు సదరు భక్తురాలు తనపై అత్యాచార అరోపణలు చేస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే సన్యాసులమని చెప్పుకునే బాబాలకు డబ్బు ఎందుకన్న విషయం మాత్రం అతను పోలీసుల విచారణలో చెప్పలేకపోయినట్లు సమాచారం. ఇదిలావుండగా, తాన క్యారెక్టర్ కు క్లీన్ సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్న బాబాకు పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని పోలీసులు నిర్ణయించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more