విజయనగరం జిల్లాలో మరో స్వాతి తరహా కేసు నమోదైంది. పది రోజులు కూడా నిండకుండానే.. పసుపు పారణి అరకముందే కొత్త పెళ్లికొడుకు హత్యచేయబడిన ఘటన విజయనగరం జిల్లాలోని గురుగుబిల్లిలో కలకలం సృష్టించగా, ప్రియుడిని విడిచి వుండలేకే భర్త హత్యకు స్కేచ్ వేసి పక్కాగా అమలు చేయించింది నవ వధువు. సోమవారం రాత్రి నవజంట.. వ్యాహ్యాళికి వెళ్లగా, ఇద్దరు దుండగులు దాడి చేసి యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే ఛేదించారు. కాగా, వారి దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి.
వివరాల్లోకి వెళితే, శ్రీకాకుళం జిల్లా చిట్టిపూడివలస గ్రామానికి చెందిన యామక గౌరీశంకరావుకు, విజయనగరం జిల్లా కడెకళ్ల గ్రామానికి చెందిన సరస్వతికి గత నెల 28న పెద్దలు వివాహం జరిపించారు. వీరిద్దరూ బావా, మరదులే కావడం గమనార్హం. అయితే సరస్వతి అప్పటికే ఓ వ్యక్తిని ప్రేమించింది. మేనబావతో వివాహం ఇష్టం లేని సరస్వతి, తన మిత్రుడు శివ, విశాఖపట్నం రౌడీషీటర్ గోపీల సాయంతో భర్తను హత్య చేయించింది. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తనపైనా దాడి చేయించుకుంది. అదే విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విచారణలో భాగంగా పోలీసులు హైవేపై తనిఖీలు చేస్తుండగా శివ, గోపీలు ప్రయాణిస్తున్న ఆటో వేగంగా వెళుతూ, ఎస్పీ ప్రయాణిస్తున్న వాహనాన్ని టేకోవర్ చేసింది. దీంతో ఆ ఆటోను ఆపిన ఎస్పీ, వారిని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చిన ఆయన, వారిని పోలీసులకు అప్పగించారు. సరస్వతిపై దాడి చేసిన వారు వీరేమోనన్న అనుమానంతో పోలీసులు విచారించగా, అసలు నిజం బయటకు వచ్చింది. కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు.
కాగా, సరస్వతిని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు అమె ఫోన్ ను స్వాధీనం చేసుకుని అధారాల కోసం కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. పెళ్లి ముందే శివ తనకు పరిచయమని అంగీకరించిన సరస్వతి, అతడినే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. అయితే తమ కుటుంబసభ్యులు మేనబావతో వివాహం నిశ్చయించారని.. ఈ పెళ్లి వద్దని, తనకు ఇష్టం లేదని చెబుతున్నా, బలవంతంగా చేశారని చెప్పింది. తన భర్త శంకర్ రావు పవర్ ప్లాంట్ లో పనిచేస్తుంటాడని, మంచి వ్యక్తేనని తనను బాగా చూసుకున్నాడని అంగీకరిస్తూనే, శివను విడిచి ఉండలేక ఈ పని చేశానని విలపించినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more