దేశ రాజధాని ఢిల్లీ పోలీసులు తీరుపై అగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పోలీసులు నిబంధనలు అతిక్రమించడమే ఇందుకు కారణమవుతుంది. యుద్ధాల్లో వీరమరణం పొందిన అమరజవాన్లకు, లేక జాతీయ స్థాయిలో, లేక రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వంలో బాగమై, ఉన్నత హోదాలను చేపట్టిన రాజకీయ నేతలకు.. ప్రభుత్వమే తమ సొంతఖర్చుతో... అధికారిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అయితే ఢిల్లీకి చెందిన కొందరు పోలీసులు చనిపోయిన నెమలికి త్రివర్ణ పతాకం కప్పి అంత్యక్రియలు నిర్వహించారు.
అది కాస్తా వివాదాస్పదంగా మారింది. అమరజవాన్లకు మాత్రమే లభించే అరుదైన గౌరవాన్ని ఢిల్లీ పోలీసులు అపహాస్యం చేస్తున్నారని పలువురు వాదిస్తుండగా, వన్యప్రాణి సంరక్షణ సంఘాలకు చెందిన కార్యకర్తలు కూడా దీనిపై అక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పక్షికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడం వల్ల అది ఎలా చనిపోయిందన్న వివరాలను బయటకు రాకుండా అడ్డుకట్ట వేయడమేనని మండిపడుతున్నారు. అసలు నెమళ్లు కానీ లేక ఏ వన్యప్రాణి మరణించినా.. అటవీశాఖ, వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులకు ముందుగా సమాచారం అందించే0లా ప్రతీ పోలీస్ స్టేషన్లకు అదేశాలను జారీ చేయాల్సిందిగా వన్యప్రాణి సంరక్షణ సంఘాల కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
అసలు ఏం జరిగిందంటే.. ఢిల్లీలోని హైకోర్టు పరిసరాల్లో గాయాలతో కన్పించిన ఓ నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వంటి నిండా గాయాలతో వున్న జాతీయ పక్షిని పోలీసులు జైన్ బోర్డ్ అసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి అధికారులు పరిశీలించి.. అది చనిపోయిందని వెల్లడించారు. దీంతో పోలీసులు దానికి అంత్యక్రియలు చేయాలని నిర్వహించి.. దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి చెక్క పెట్టలో ఉంచి అధికార లాంఛనాల మాదిరిగా ఘట్టాన్ని పూర్తి చేశారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ..‘మన జాతీయ పక్షి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చాం. ఇది ప్రొటోకాల్. మున్ముందు ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహిస్తాం’ అని తెలిపారు.
చనిపోయిన ఈ నెమలి షెడ్యూల్-1కు చెందిన పక్షి. అంటే 1972 వన్యసంరక్షణ చట్టం ప్రకారం ఈ పక్షి సంబంధించిన అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది. ఇలాంటి కోవకు చెందిన నెమళ్లు చనిపోతే రాష్ట్ర అటవీ శాఖ వాటికి పోస్ట్మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అలాంటిది చనిపోయిన నెమలిని అటవీ శాఖకు అప్పగించకుండా పోలీసులే సొంతంగా నిర్ణయం తీసుకోవడం సబబు కాదని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more