ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మానసపుత్రిక పథకం స్వచ్ఛా భారత్ అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే క్లీన్ ఇండియా పథకానికే ఆయన పేరు మార్చి ఇలా యూపీఏ పథకాన్ని హైజాక్ చేశారన్న విమర్శలు వున్నా.. ప్రధాని మాత్రం వాటిని పట్టించుకోకుండా భారత దేశం పరిశుభ్రంగా మార్చేందుకు కంకణబద్దుడయ్యాడు. ఇందుకోసం సాధారణ ప్రజల్లో అవగాహాన కల్పించేందుకు అటు టీవీ ఛానెళ్లు, ఇటు దినపత్రికలో నిరంతరం ప్రకటనలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా పరిశ్రుభతతో వ్యాధులకు దూరంగా వుండవచ్చునని, రోగాలు దరిచేరకుండా చేయవచ్చునని కూడా అవగాహన కల్పిస్తున్నారు.
ఈ పథకంలో ముఖ్యభూమికగా బహిరంగ మలమూత్ర విసర్జన చేయకూడదని కూడా చెప్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను కూడా భాగం చేశారు. అటు బాలీవుడ్ నుంచి అన్ని రాష్ట్రాల సినీపరిశ్రమలకు చెందిన ప్రముఖులను రాజకీయ నేతలను, మేధావులను, క్రీడా రంగ ప్రముఖులను కూడా భాగం చేశారు. అయితే ఆయన మానసపుత్రిక పథకానికి ఆయన పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే తూట్లు పోడుస్తున్నారు. ఇప్పటికే కేంద్రమంత్రి ఒకరు బహిరంగంగా మూత్రవిసర్జన చేసిన ఫోటోలు కలకలం రేపగా, తాజాగా రాష్ట్ర మంత్రి కూడా అదే పనిచేశారు.
రాజస్థాన్ లో వసుంధరా రాజే ప్రభుత్వంపై విమర్శలు పెరుగుతున్న క్రమంలో ఆ రాష్ట్రానికి చెందిన మంత్రి ఇలాంటి చర్యలకే పాల్పడి.. నెట్టింట్లో వైరల్ అయ్యారు. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో తమ మంత్రి వర్గానికి చెందిన వారు ఇలా చేయడం.. వసుందరా రాజేకు శరఘాతంలా పరిణమించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. రాజస్థాన్ ఆరోగ్య మంత్రిగా ఉన్న కాళీచరణ్ సరాఫ్, తన కారును రోడ్డు పక్కన ఆపించి, పక్కనే ఉన్న ఓ గోడకు మూత్ర విసర్జన చేస్తున్న చిత్రాలు ఇప్పుడు జైపూర్ లో కలకలం రేపుతున్నాయి. ఇలా తాను చేసిన తప్సును కూడా సమర్థించుకోవడంతో అదికాస్త మరింత వైరల్ అయింది.
స్వచ్ఛ భారత్ అభియాన్ లో పోటీకి నిలిచిన జైపూర్ ను మరింత పరిశుభ్రం చేయాలని మునిసిపల్ కార్పొరేషన్ ఎంతో శ్రమిస్తుంటే, స్వయంగా ఆరోగ్య మంత్రిగా ఉన్న కాళీచరణ్ సరాఫ్ బహిరంగ మూత్రవిసర్జన చేయడంతో ఈ పని చేయడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సాధారణ ప్రజులు ఎవరైనా ఇలా బహిరంగంగా గోడలను తడిపితే రూ. 200 జరిమానా వేస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులను మాత్రం ఏమీ చేయడం లేదని, ప్రజలు మారుతున్నా, ఈ నేతలు మారడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కాగా, తన ఫోటో వైరల్ అవుతుండటంపై స్పందించిన సరాఫ్, ఇదేమీ అంత పెద్ద విషయం కాదని వ్యాఖ్యానించడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more