రాష్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో అన్ని పార్టీలు ఒకే వేదికపైకి వచ్చి ఉద్యమించాల్సిన అవసరముందని జనసేన అధినేత, సినీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్ అన్నారు. ఉండవల్లి అరున్ కుమార్, జయప్రకాష్ నారాయణ వంటి అనుభవజ్ఞులైన రాజకీయ నేతలతో పాటు అనంతపురం, శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీల ప్రొఫెసర్లు, సీపీఐలోని కొందరు నాయకులు మరికొందరితో కూడా జేఏసీ ఏర్పాటు చేయాలని యోచనలో వున్నట్లు చెప్పారు. తాను ప్రజల పక్షం తప్పా పార్టీల పక్షం కాదని చెప్పుకొచ్చారు.
ప్రత్యేక హోదా కోసం ఉద్యమించేందుకు కేవలం తన గొంతు మాత్రమే సరిపోవడం లేదని పవన్ అన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి తమ డిమాండ్ ను సాధించుకునేందుకు మరింత బలం కూడగట్టుకోవాల్సిన అవసరం వుందని అన్నారు. అప్పట్లో తెలంగాణ కోసం అందరూ కలిశారని, లోక్సభను స్తంభింపజేశారని అన్నారు. అలాగే, ఆంధ్రప్రదేశ్కు విభజన హామీలను సాధించేందుకు ఓ వేదిక ఉండాలని నిర్ణయించానని తెలిపారు. మాజీ మంత్రి ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా జయప్రకాశ్ నారాయణ లాంటి వారిని కలుపుకుని ముందుకు వెళతానని చెప్పారు.
ఇందుకోసం తాను స్వయంగా ఉండవల్లి, జయప్రకాశ్ నారాయణలను తాను వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అశించినంతమేర నిధుల కేటాయింపులు జరపని కారణంగా వామపక్షాలు ఇచ్చిన రాష్ట్ర బంద్ కు తాను వ్యతిరేకం కాదని పవన్ అన్నారు. కాకపోతే శాంతియుతంగా నిరసనలు జరపాల్సి ఉందని చెప్పుకొచ్చారు. బంద్ ల పేరుతో మనవాళ్లని మనం ఇబ్బందులకు గురిచేయడం సరికాదని చెప్పారు. ప్రభుత్వాలు చట్టంలో ఉంచిన అంశాలను కూడా చేయకపోతే ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందని చెప్పారు. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేకహోదా ఇస్తామని పెట్టిందని దానిని అమలు చేయమనే జేఏసీ అధ్వర్యంలో ఉద్యమిస్తామని చెప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more