నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో న్యాయం జరగలేదని నిరసిస్తూ వామపక్షాలు ఇచ్చిన బంద్ పిలుపుకు రాష్ట్ర ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. దీంతో ఆంధ్రప్రదేశ్ లో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి తీవ్ర అన్యాయం జరిగడంతో కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ రమారమి అన్ని పార్టీలు బంద్ కు మద్దతునిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో జనజీవనం స్థంభించింది. రవాణా వ్యవస్థ ఎక్కడికక్కడ నిలిచిపోయింది.
ఉదయాన్నే వామపక్ష నేతలు ఢిపోల వద్దకు చేరుకుని ధర్నాలు చేయడంతో బస్సులన్నీ డిఫోలకే పరిమితం అయ్యాయి. ఇక పలు ఢిపోల్లో అర్టీసీ డ్రైవర్లు కూడా బంద్ కు మద్దతు సంఘీభావం తెలిపారు. రాష్ట్రంలోని ప్రధాన రహదారులపై వామపక్ష నేతలతో పాటు యువకులు కబడ్డీ అడుతూ నిరసన తెలిపడంతో ప్రధాన రహదారులపై కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడే స్థంభించింది. బంద్ నేపథ్యంలో రాష్ట్రంలోని పాఠశాలలకు ముందుగానే యాజమాన్యాలు సెలవు ప్రకటించాయి. అంద్రరాష్ట్ర ఉద్యమాల పురిటిగడ్డగా పేరొందిన అంధ్ర విశ్వవిద్యాలయంలో విద్యార్థులు తరగతులను బహిష్కరించారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణం, పోలవరం నిర్మాణం, ప్రత్యేక రైల్వేజోన్ వంటి అంశాల ప్రస్తావన ఏదీ బడ్జెట్టులో లేకపోవడాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంను బహిరంగ లేఖ ద్వారా సీపీఐ కోరింది. అయితే బంద్ వల్ల ప్రజలు ఇబ్బంది పడతారని, బంద్ ను విరమించుకోవాలని సీఎం వామపక్ష పార్టీలకు సూచించగా, వామపక్ష పార్టీలు ఆయనపై మండిపడ్డాయి. కాగా కాంగ్రెస్, సహా వైఎస్సార్ సీపీ పార్టీలు కూడా బంద్ కు సంఘీభావం తెలుపాయి.
కాగా, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తాము కేవలం నిరసనలు మాత్రం తెలుపుతామని టీడీపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. బంద్ కు మద్దతు తెలపాలని వామపక్ష పార్టీలు ఇతరపార్టీలను కోరగా కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, జనసేన, లోక్ సత్తా తదితర పార్టీలు, పలు ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. బంద్ ను పురస్కరించుకుని విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు తెలిపాయి. అయితే ప్రభుత్వ సంస్థలు యథావిధిగా నడుస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నప్పటికీ, వాటిని అడ్డుకుంటామని ప్రజా సంఘాలు ప్రకటించాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more