కారు విక్రయించిన వెంటనే కొన్న వ్యక్తి పేరున రికార్డులు మార్పించాల్సిన భాద్యతను కూడా అమ్మిన వ్యక్తులు తీసుకోవాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. తన వద్దనున్న కారుతో పాటు ఈ కారును కూడా తన పేరున నమోదు చేయించుకుంటే పన్ను అధికంగా కట్టాల్సి వస్తుందని.. వాటి ఎగవేతల కోసం వాహనాలు కొన్న వ్యక్తులు తమ పేరున కారును ట్రాన్స్ ఫర్ చేసుకునేందుకు సుముఖత వ్యక్తం చేయరు.
అయితే కారు తమ పేరున ట్రాన్స్ ఫర చేయించుకుంటే తప్ప కారును విక్రయించమని తేగేసి చెప్పాలని అత్యున్నత న్యాయస్థానం వాహనదారులకు సూచిస్తుది. ఇలా చేయని పక్షంలో మీ వాహనాన్ని కొన్న వ్యక్తి కారును సొంతం చేసుకున్నప్పటికీ.. వారి చేతిలోనే లేక వారి బంధుమిత్రుల చేతుల్లో జరిగే ప్రమాదాలకు మాత్రం మీదే బాధ్యత అవుతుందని దేశ సర్వన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
బాధితులకు పరిహారం చెల్లింపుల విషయంలో కారు రికార్డుల పరంగా ఎవరు యజమానిగా వుంటే వారిదే అవుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి నేపథ్యంతో వున్న ఓ కేసు విచారణ సందర్భంగా తీర్పును వెలువరించిన న్యాయస్థానం ఈ విషయాలను స్పష్టం చేసింది. విజయ్ కుమార్ అనే వ్యక్తి జూలై 12, 2007లో మరో వ్యక్తికి తన కారును విక్రయించాడు. సెప్టెంబరు 18, 2008లో ఆయన మరో వ్యక్తికి ఆ వాహనాన్ని అమ్మేశాడు. ఈ మూడో వ్యక్తి నవీన్ కుమార్కు కారును విక్రయించాడు.
ఆయన మీర్ సింగ్ అనే వ్యక్తికి దానిని విక్రయించినట్టు ‘మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రైబ్యునల్’కు తెలిపాడు. మీర్ సింగ్ వద్ద ఉన్న కారును వేరే వ్యక్తి నడుపుతున్నాడు. ఈ క్రమంలో మే 27, 2009లో కారు ప్రమాదానికి గురైంది. ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసును విచారించిన ట్రైబ్యునల్ బాధిత కుటుంబానికి పరిహారంగా రూ.3.85 లక్షలు చెల్లించాల్సిందిగా రిజిస్ట్రేషన్ పత్రాల ఆధారంగా కారు యజమాని విజయ్కుమార్ను ఆదేశించింది.
ట్రైబ్యునల్ తీర్పును విజయ్ కుమార్ హరియాణా హైకోర్టులో, తర్వాత సుప్రీంకోర్టులో సవాలు చేశాడు. కేసును విచారించిన త్రిసభ్య ధర్మాసనం కారు రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న యజమానే అందుకు బాధ్యుడు అవుతాడని వ్యాఖ్యానించింది. ఓనర్షిప్ మార్చకుండా ఎన్నిసార్లు విక్రయించినా, ఎంతమంది నడిపినా రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఉన్న వ్యక్తే బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. బాధిత కుటుంబానికి పరిహారం చెల్లించాలని తీర్పు ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more