టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత.. ఇటీవలే అక్కినేని వారసుడు నాగచైతన్యను పరిణయమాడి తెలుగింటికి కొడలుగా వచ్చిన అమ్మాయిని తెలంగాణ అధికార పార్టీ కూడా అదే మర్యాదను ఇచ్చి గౌరవించాలని భావిస్తుందా..? అంటే అవునన్న సంకేతాలే కనిపిస్తున్నాయి. అదేంటి ఇప్పటికే అమెను తెలంగాణ చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా చేశారు. అంటే అది ప్రభుత్వానికి సంబంధించిన అంశం. కానీ మేము చెబుతున్నది పార్టీకి సంబంధించిన అంశంమన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి.
రానున్న సార్వత్రిక ఎన్నికలలో.. తెలుగురాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ వున్న అగ్రనటిని పార్లమెంటుకు, లేదా అసెంబ్లీకి పంపించాలని తెలంగాణ రాష్ట్ర సమితి భావిస్తుందన్న పుకార్లు మాత్రం రాజకీయవర్గాల్లో షికార్లు కోడుతున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియాలో వదంతులు తీవ్ర సంచలనంగా మారి వైరల్ అవుతున్నాయి. సమంత రాజకీయాల్లోకి రానుందని, 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పోటీ చేయనుందని వార్త నెట్టింట్లో సంచలనంగా మారింది.
ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త పట్లు సమంత తరపున ఆమె ప్రతినిధులు ఈ అంశమై తాపీగా స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఆమెకు రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన లేదని వారు స్పష్టంగా చెప్పారు. అయితే అమె తెలంగాణ చేనేతకు మాత్రం బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతారని చెప్పారు. అసలు ఈ వదంతులు వ్యాపించడానికి గల కారణాలు ఏంటని విశ్లేషిస్తే.. అసలు విషయం బయటపడింది.
తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న సమంత.. ఇటీవల చేనేత అధికారులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. చేనేత వస్త్రాలను మరింత ఎక్కువస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై అమె అధికారుల సమావేశంలో చర్చించారు. దీంతో ఇలాంటి పుకార్లు పుట్టుకొచ్చాయని తెలుస్తోంది. అయితే అమె తరపు ప్రతినిధులు మాత్రం ఇలాంటి వార్తలను తోసిపుచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more