కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని.. ఇటీవలే ముగిసిన గుజరాత్ ఎన్నికల ఫలితాలను కూడా పరిగణలోకి తీసుకుని దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తగ్గుముఖం పట్టిన ఇంధన ధరలు.. క్రమంగా పెరుగుతూ రూ.80కి లీటర్ వరకు చేరాయి. ఇక డీజిల్ పై కూడా రాయితీని క్రమంగా పెంచుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికలకు సిద్దమవుతున్న కేంద్రం ధరలను తగ్గించే పనుల్లో పడింది. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ పై విధిస్తున్న సేల్స్ ట్యాక్స్ లేదా వ్యాట్ ను తగ్గించాలంటూ కేంద్రం రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.
వినియోగదారులకు ప్రయోజనాలు చేకూర్చేందుకు రాష్ట్రాలు పన్నులు తగ్గించాలని ఆయిల్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆదేశించారు. ''పలు రాష్ట్రాలు వ్యాట్ ను తగ్గించాయి. మరోసారి మేము అభ్యర్థిస్తున్నాం. ఎక్కువ మొత్తంలో వ్యాట్ ను కలిగి ఉన్న రాష్ట్రాలు, వినియోగదారుల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని పన్ను రేట్లను తగ్గించాలి'' అని మంత్రి చెప్పారు. అంతేకాక పెట్రోలియం రంగాన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ పరిధిలోకి తీసుకురానున్నట్టు కూడా తెలిపారు.
అంతర్జాతీయ ధరల ప్రభావంతో ఇటీవల విపరీతంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ పెంపుదలను నియంత్రణలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించింది. లీటరు పెట్రోల్కు 21.48గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.19.48కు తీసుకొచ్చింది. అదేవిధంగా డీజిల్పై రూ.17.33గా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని రూ.15.33కు కుదించింది. ఈ తగ్గింపు ప్రయోజనాలు వినియోగదారులకు అందించాలని, అన్ని రాష్ట్రాలు వ్యాట్ల్లో కోత పెట్టాలని కేంద్రం అంతకముందే ఆదేశించిన సంగతి తెలిసిందే.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more