పార్లమెంటు సాక్షిగా అబద్దపు ప్రకటనలు చేయడంపై నిలదీసిన రాజ్యసభ సభ్యుడికి అవమానం ఎదురైంది. ఏకంగా చట్టసభలో తప్పుడు ప్రకటనలు చేసి.. పబ్బం గడుపుకోవాలని యత్నించిన కేంద్రమంత్రి చేతిలోనే ఆయనకు ఈ పరాభవం ఎదురైంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చివరాఖరకు దాయాధి పాకిస్థాన్ వాసుల చేత కూడా శభాష్ అనిపించుకున్న ఈ కేంద్రమంత్రి ఎవరో కాదు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్.
దీనిపై అయన ఏకంగా రాజ్యసభలోనే సుష్మాస్వరాజ్ పై విమర్శలు గుప్పించారు. కేంద్ర విదేశీవ్యవహరాల శాఖను అమె తన సోంత కార్యాలయంగా మార్చుకున్నారని మండిపడ్డారు. భారతీయుల అచూకీపై బాధ్యాతాయుతంగా వ్యవహరిస్తున్న తన పట్ల కేంద్రమంత్రి చర్యలను ఆయన తప్పబట్టారు. ఇరాక్ లో తప్పిపోయిన 39 మంది భారతీయుల గురించి ప్రశ్నించి.. వారి వివరాలే ఏమైనా తెలిసాయా.? అంటూ అడుగుతుంలూ కేంద్రమంత్రి తన అకౌంట్ ను బ్లాక్ చేశారని ఇదెక్కడి చోద్యమని ఆయన తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు.
అయితే ఇదే అంశంపై మాటిమాటికి అడుగుతున్న కారణంగా ట్విట్టర్లో కాంగ్రెస్ ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా ఖాతాను, విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ బ్లాక్ చేశారు. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్ను షేర్ చేస్తూ ప్రతాప్ సింగ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా రాజ్యసభలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. 'విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇలాగేనా పని చేసేది? తప్పిపోయిన భారతీయుల గురించి అడిగినందుకు ఒక పార్లమెంటు సభ్యుడిని ఇలా బ్లాక్ చేస్తారా?' అంటూ ప్రతాప్ మండిపడ్డారు.
వీరిద్దరి మధ్య వైరం జులైలో ప్రారంభమైంది. ఇరాక్లో 39 మంది భారతీయులు తప్పిపోయారని సుష్మా స్వరాజ్ లోక్సభలో ప్రకటించగానే ప్రతాప్ బజ్వా ఆమె వ్యాఖ్యలను ఖండించారు. తప్పిపోయినవారి ఆచూకీ గురించి చెప్పడంలో సుష్మా వాస్తవాలు చెప్పడం లేదని విమర్శలు చేశారు. ఇక అప్పటినుంచి వీలు చిక్కినప్పుడల్లా ఆయన ట్విట్టర్లో ఆ భారతీయుల గురించి అడుగుతూనే ఉన్నారు.
Is this the way to run external affairs ministry?
— Partap Singh Bajwa (@Partap_Sbajwa) December 27, 2017
Does it behove the office of Sushma Swaraj ji to block a Member of Parliament for asking tough questions on 39 Indians missing in Iraq? pic.twitter.com/CvYl8aLREF
My questions to EAM Sushma Swaraj today in the Rajya Sabha on 39 Indians missing in Iraq. pic.twitter.com/fK4qxictum
— Partap Singh Bajwa (@Partap_Sbajwa) July 27, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more