జనసేన పార్టీలో ఇవాళ నాటిన చిన్న విత్తనాలే రేపు.. మహావృక్షాలవుతాయని ఆ నమ్మకం, విశ్వాసం తనకు వున్నాయని జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి మార్పు కోసం ప్రయత్నం చేస్తే.. దానిని అచరణ సాధ్యం కాకుండా కొందరు అడ్డుకున్నారని.. వారందరికీ త్వరలోనే జనసేన గుణపాఠం చెబుతుందని అన్నారు. ఈ విషయం ప్రస్తావిస్తున్నప్పుడు పవన్ భావోద్వేగానికి గురయ్యారు. తన సోదరుడు పార్టీ వచ్చింది పోయింది.. తనది కూడా అలాంటి పార్టీయేనన్ని విమర్శలు వచ్చాయన్నారు. అయితే తాను సరదాగా పార్టీని స్థాపించలేదన్న విషయాన్ని పవన్ కల్యాన్ తేల్చిచెప్పారు.
అధికార కాంక్ష తనకు లేదని చెప్పిన పవన్.. అధికారం వుంటే ఎంత సేవ చేయగలమోనన్న విషయాలు మాత్రం తెలుసునని అన్నారు. కొన్నాళ్ల క్రితం వరకు సత్యాగ్రహి చిత్రానికి సంబంధించిన కథను రాసుకుంటున్నాని చెప్పిన పవన్.. సినిమాల వల్ల వ్యవస్థల్లో మార్పు రాదని చెప్పారు. అయితే ఆచరణతో మాత్రమే ఇది సాధ్యమని.. తాను అచరించి మరోకరికి ఈ విషయాన్ని చెప్పవచ్చునని అన్నారు. అయితే ఆచరణతో వ్యవస్థల్లో సమూల మార్పులు సాధ్యం అవుతాయని తాను చెప్పడం లేదని.. అయితే సమాజంలో కొంత మార్పుకైనా తమ అచరణ దోహదం చేస్తే చాలునని అన్నారు.
విశాఖపట్నంలో పర్యటిస్తోన్న పవన్ కల్యాణ్ తమ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. తనకు రాజకీయాల్లోకి రావాలని ఉందని 2003లో తన అమ్మానాన్నలకి చెప్పానని అన్నారు. తాను బీజేపీ, టీడీపీ పక్షం కాదని ప్రజల పక్షం అని అన్నారు. సినిమా తనకు అన్నం పెట్టిందని, రాజకీయ వ్యవస్థ బాగుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని పవన్ చెప్పుకొచ్చారు. తాను రాజకీయాల్లోకి వచ్చింది ఏదో సాధించడానికి కాదని అన్నారు. తన మనస్సాక్షికి సమాధానం చెప్పుకునేందుకేనని అన్నారు.
దేశ స్వతంత్ర్య సంగ్రామ సమరయోధులు, తొలి కేంద్రమంత్రుల మండలి సభ్యులు అయిన లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, నెహ్రూ, రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ లాంటి నేతల స్ఫూర్తి కొరవడి.. ఏం జరిగినా ఫర్వాలేదని ముందుకు సాగిపోతున్న నేటి రాజకీయ నేతలు తీరుతో భాధకరంగా మారాయని అన్నారు. మన ఆలోచనలు వేరు వేరుగా ఉండొచ్చని, లోపల తపన మాత్రం ఒకటే ఉంటుందని అన్నారు. జగమంత కుటుంబం మనది, వసుదైక కుటుంబం మనది అని ఆయన చెప్పుకొచ్చారు. దేశ రాజకీయాలకు కొత్త రక్తం కావాలని అన్నారు. మారాలని చెబితే ఎవ్వరూ మారరని, మనం మంచి దారిలో నడిచి చూపిస్తే మనల్ని చూసి మారతారని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more