పొట్టచేత పట్టుకుని విదేశాలకు వలస వెళ్లిన కార్మికులకు ఖతార్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ దేశంలో ఉద్యోగం చేయాలని భావించే అశావహుల కోసం వేచివున్న విదేశీ కార్మీకుల నివాస ప్రక్రియలను ఖతార్ సులభతరం చేసింది. కార్మికులు ఈ మేరకు తమ స్వదేశంలోనే విధానాలన్నింటిన్నీ పూర్తి చేసుకునే వీలు కల్పించింది. ఈ కొత్త ఒప్పందంపై ఖతారీ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సింగపూర్ కు చెందిన కంపెనీ సంతకాలు చేసుకున్నాయి. ఖతారీ నివాస ప్రక్రియలన్నింటిన్నీ విదేశీ వర్కర్లు తమ స్వదేశంలోనే పూర్తి చేసుకునే వెసలుబాటును కల్పించింది.
ఈ మేరకు ఖతార్ న్యూస్ ఏజెన్సీ వివరాలను వెల్లడించినట్టు జిన్హువా న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. ఈ ప్రాజెక్టు తొలి దశలో ఎనిమిది దేశాలకు వర్తింపజేసింది. భారత్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, ట్యునీషియాలు ఉన్నాయి. ఖతార్ మొత్తం వర్క్ఫోర్స్లో ఈ దేశాల వారు 80 శాతం ఉంటారు. దీంతో ఆయా దేశాల నుంచి ఖతార్ వెళ్లేందుకు అసక్తి చూపేవారు ఇకపై స్వదేశంలోనే తమ సంబంధిత డాక్యుమెంట్లను పొందపర్చే అవకాశాన్ని కల్పించింది
ఈ ఓప్ప్ందం ప్రకారం విదేశీయులు తమ మెడికల్ చెకప్, బయోమెట్రిక్ డేటా, ఫింగర్ప్రింట్, వర్క్ కాంట్రాక్టులపై సంతకం అన్ని కూడా ఖతార్కు రాకముందే తమ స్వదేశంలోనే పూర్తి చేసుకునే అనుమతి ఉంటుంది. ఈ డీల్తో మెడికల్ టెస్ట్లో విఫలమయ్యారని విదేశీ వర్కర్లను దేశంలోకి తిరస్కరించే కేసులు తగ్గుతాయని తెలిసింది. అక్టోబర్ మొదట్లోనే ఖతార్ ఈ డ్రాఫ్ట్ బిల్లును రూపొందించింది. విదేశీ వర్కర్లు తమ ఉద్యోగులు మారడానికి వీలుగా గతేడాదే ఖతార్ ప్రభుత్వం కొత్త లేబర్ చట్టాన్ని ప్రవేశపెట్టింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more