దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఢిల్లీలోని కార్పొరేట్ స్కూల్ లోని చిన్నారి విద్యార్థి మర్డర్ కేసు మరో మలుపు తిరిగింది. రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో ఏడేళ్ల చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్ హత్య కేసులో నిందితుడు ఆ పాఠశాల ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థేనని చెబుతున్న సీబిఐ ఈ కేసులో స్కూల్ బస్సు కండెక్టర్ నిందితుడు కాదని చెబుతోంది. కార్పోరేట్ పాఠశాలలో విద్యార్థి హత్య ఘటన కలకలం రేపడంతో దీనిని సీబిఐకి అప్పగించారు. దీంతో విచారణ ప్రారంభించిన సిబీఐ సాక్షాధారాలు సేకరించే పనిలో నిమగ్నమైంది.
తమకు అందిన అధారాల మేరకు ఇవాళ వివరాలను తెలియజేసిన సీబీఐ.. ఎవరూ ఊహించని విషయాలు చెప్పింది. సెప్టెంబర్ 8వ తేదీ ఢిల్లీ గుర్ గామ్ లోని రియాన్ ఇంటర్నేషనల్ స్కూల్ లో జరిగిన ప్రద్యుమన్ ఠాకూర్ మర్డర్ కేసులో నిందితుడు అదే పాఠశాలలో ఇంటర్ తొలి సంవత్సరం చదువుతున్న విద్యార్థేనని తమ విచారణలో తేలిందని అన్నారు. నిన్న రాత్రి ఇంటర్ విద్యార్థిని అదుపులోకి కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే కేవలం పరీక్షలను వాయిదా వేయించేందుకు మాత్రమే ఆ విద్యార్థి చిన్నారి ప్రద్యుమన్ ఠాకూర్ ను హతమార్చినట్లు తమ దర్యాప్తుతో తేలిందని అన్నారు.
ఇంటర్ విద్యార్థి ప్రమేయంపై ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించినట్లు సీబీఐ అంటోంది. మొదటగా బాత్రూమ్ లో ప్రద్యుమన్ చనిపోయి ఉన్న విషయాన్ని ఈ స్టూడెంట్ ద్వారానే వెలుగులోకి వచ్చింది. యాజమాన్యానికి చెప్పింది కూడా ఈ స్టూడెంటేనని పాఠశాల యాజమాన్యం కూడా చెబుతుంది. కాగా ఇంటర్ విద్యార్థి తండ్రి మాత్రం తన కుమారుడ్ని సీబీఐ అధికారులు అనవసరంగా అరెస్ట్ చేశారని తెలిపాడు. తన కొడుకుకి ఈ హత్యతో సంబంధం లేదని చెబుతున్నారు. హత్య జరిగినప్పుడు పరీక్ష రాస్తున్నాడని పేరంట్స్ అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more