స్మార్ ఫోన్ ప్రియులుకు చేతిలోనే ప్రపంచాన్ని అందించి.. అప్పటి వరకు డేటా వినియోగంపై వున్న ఆఫర్లు ఓ ఎత్తు.. తమది మరో ఎత్తు అంటూ టెలికాం రంగంలోని దిగ్గజ సంస్థలకు గట్టిపోటీనిచ్చి. వణుకు పుట్టించిన రిలయన్స్ జియోకు.. మరింత పోటీ ఇచ్చేందుకు భారతీ ఎయిర్ టెల్ మరో సరికొత్త ఆఫర్ ను కస్టమర్లకు అందుబాలులోకి తీసుకువచ్చింది. ఏ డేటా అయితే ఉచితంగా ఇచ్చి తమ కస్టమర్లను జియో లాగేసుకుందని టెలికాం సంస్థలు భావిస్తున్నాయో.. అదే డేటాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50శాతం ఉచితంగా అందించేందుకు ఎయిర్ టెల్ రెడీ అయ్యింది.
అయితే ఇది అన్ని ఫ్లాన్ కు వర్తింపజేయకుండా కేవలం రూ.349 ప్లాన్ పై మాత్రమే అందించనున్నట్టు తెలిపింది. ఈ ప్లాన్ పై ప్రస్తుతం 1జీబీ డేటా అందిస్తుండగా... ఇక నుంచి రోజుకు 1.5జీబీ 4జీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంటే ప్రస్తుతం ఆఫర్ చేస్తున్న దాని కంటే 50 శాతం ఎక్కువన మాట. కాగా ఈ ప్లాన వాలిడిటీలో ఎలాంటి మార్పు లేదు. 28 రోజుల వరకు వాలిడిటీ ఉంటుంది. ఇక ఈ ప్లాన్ లో యథావిధిగా రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్, 3వేల ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.
ఇటీవలే ఈ ప్లాన్ పై పరిమిత కాల వ్యవధిలో 100 శాతం క్యాష్ బ్యాక్ అపర్ ను కూడా ఎయిర్ టెల్ అందించిన సంగతి తెలిసిందే. రూ.349 ప్లాన్ పై ఈ మరింత డేటా అందించడంతో పాటు రూ.448తో మరో కొత్త ప్లాన్ ను ఎయిర్ టెల్ లాంచ్ చేసింది. ఈ ప్లాన్ కింద 70 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా చొప్పున 70జీబీ డేటాను అందించనున్నట్టు తెలిపింది. అంతేకాక ఈ ప్లాన్ పై అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్, రోమింగ్ పై ఉచితంగా అవుట్ గోయింగ్ కాల్స్, 3000 ఎస్ఎంఎస్ లు అందుబాటులో ఉంటాయి. మై ఎయిర్ టెల్ యాప్ ద్వారా ఈ ప్లాన్ ను అందుబాటులో ఉంచింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more