ఉత్తర్ప్రదేశ్లోని రాయ్ బరేలిలో ఎన్టీపీసీకి చెందిన ఉంచహార్ ప్లాంటులో బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 100 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని రాయ్ బరేలి ఏడీజీ (లా అండ్ ఆర్డర్) ఆనంద్ కుమార్ వెల్లడించారు. ఎన్టీపీసీ ఉంచహార థర్మల ప్లాంటులోని ఆరవ యూనిట్ లో ఇవాళ సాయంత్రం ఈ పేలుడు సంభవించింది.
బాయిలర్ పైప్ తెరిచిన వెంటనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు మారిషస్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విషయం తెలిసిన వెంటనే స్పందించారు. తక్షణమే సహాయకచర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు తనకు సమాచారం తెలియజేయాలన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చోప్పున నష్టపరిహారాన్ని ప్రకటిస్తూ.. ఈ మేరకు ఆదిత్యనాథ్ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి (ఇన్ఫర్మేషన్) అవనీష్ అవస్థి తెలియజేశారు. సంఘటనా స్థలంలో సహాయక చర్యలు జరుగుతున్నాయని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నామని రాయ్ బరేలీ ఎస్పీ శివ్ హరి మీనా చెప్పారు.
UPDATE: Death toll in NTPC plant explosion in UP rises to 12, around 100 people injured pic.twitter.com/8sKyNNjGJl
— Doordarshan News (@DDNewsLive) November 1, 2017
Got a video from my friend at NTPC unchahar. #NTPC @ZeeNewsHindi @abpnewstv @TimesNow @republic @indiatvnews @CNNnews18 @DDNewsLive @WIONews pic.twitter.com/H3ZncIde9o
— Mohit Sharma (@mohitshrm8) November 1, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more