నేపాల్ లో హిందూ మత గురువులు మూడేళ్ల బాలిక త్రిష్ణా శాక్యను తమ ఇష్ట దేవతగా ఎంపిక చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. ఒకసారి కుమారీగా ఎంపికైన బాలిక యుక్త వయస్సు వచ్చే వరకు దేవతగా ఉండనున్నారు. నాలుగేళ్ల యవస్సులో కుమారీగా మారిన 'ప్రీతి శక్యా' యుక్త వయస్సుకు చేరుకుంది. దీనితో తాజా ఎంపిక అవసరమైంది. నేపాల్ అధ్యక్షుడు ఆమోదం తెలుపడంతో ఎంపిక ప్రక్రియను చేపట్టారు.
క్రీ.శ. 12-18 శతాబ్దాల మధ్యలో నేపాల్ ను మల్ల రాజుల పరిపాలించాడు. ఆయన ఆరాధ్య దేవత 'తలెజు'. ఈ కుమారీలను మానవరూపంలో తమ ఇష్టదైవమైన 'తలెజు'గా భావిస్తారు. ఇక కుమారీల ఎంపికకు కొన్ని కఠిన పరీక్షలుంటాయి. మూడు వారాల పాటు కఠిన పరీక్షలు నిర్వహిస్తారు. అంతకంటే ముందు ఎలాంటి లోపాలు లేని కళ్లు ఉండాలి. దంతాలు ఉండాలి. అలాగే శరీరంపై ఎలాంటి గాయాలు ఉండకూడదు. అత్యంత ధైర్యసాహసాలు కలిగి ఉండాలి. బలి ఇచ్చిన పశువుల మధ్య ఓ రాత్రి అంతా ఉండాలి. ఇలాంటి కొన్ని కఠిన పరీక్షలు..ప్రత్యేక అర్హతలు కలిగి ఉండాల్సి ఉంటుంది.
ఇక కుమారీలను పటాన్, ఖాట్మాండు, భక్తపూర్ ల నుండే ఎంపిక చేయబడుతారు. గుత్తి సంస్థాన్ నిర్వాహణ కమిటీ (జీఎన్ఎంసీ) సిఫార్సుల మేరకు కుమారీ ఎంపిక జరుగుతుంది. కుమారీగా ఎన్నికైన అనంతరం రజస్వల కాగానే ఆమెలో దైవత్వం పోతుందని అక్కడివారి నమ్మకం. అప్పటి నుంచి మరో కుమారిని ఎన్నుకునేందుకు పరీక్షలు జరుగుతాయి. ఎంపిక అనంతరం కూడా కొన్ని కఠిన నియమ నిబంధనుంటాయి. రాజధాని ఖాట్మాండులోని పురాతన ఆలయంలో మత ఆచారాల ప్రకారం కుమారీలను ప్రత్యేక సంరక్షణలో ఉంచుతారు. వారు ఎరుపు దుస్తులను ధరించాల్సి ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more