చదలవాడ కృష్ణమూర్తి పదవీకాలం ముగియడంతో ఆ పదవిపై కన్నేసిన పార్టీ ఎంపీ రాయపాటీ కాసింత అసహనానికి గురికావడంతో.. ఆయనను శాంతింపజేసిన పార్టీ అధిష్టానం.. ఈ పదవికి మరో నేతను ఎంపిక చేసింది. రమారమి ఆయనకే ఆ పదవికి కూడా దక్కనుంది. ఇంతకీ ఆ పదవి ఏంటంటారా..? తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్. మరీ ఆ నేత ఎవరంటారా..? పుట్టా సుధాకర్యాదవ్. పార్టీలో కేవలం జిల్లాస్థాయిలో అందులోనూ కేవలం తన నియోజకవర్గ పరిధికి మాత్రమే పరిమితమైన నేతను.. టీటీడీ చైర్మన్ గా ఎంపిక చేసిందని, ఇక రమారమి ఆయన పేరును అధికారింగా ప్రభుత్వం ప్రకటించనుందని సమాచారం.
అయితే ఇక్కడ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు చందాన్ని టీడీపీ అనుసరిస్తుందా..? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి, కడవ జిల్లా మైదుకూరుకు చెందిన సుధాకర్ యాదవ్ కు టీటీడీ పగ్గాలను అందించి.. రానున్న ఎన్నికలలో ఆయనను పక్కకు తప్పించి.. ఆ స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్ర రెడ్డికి టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 2014 ఎన్నికల్లో మైదుకూరు నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రఘురామిరెడ్డి చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి పార్టీ వ్యవహారల్లో చురుగ్గాల పాల్గొంటున్న సుధాకర్యాదవ్ పేరును టీటీడీ చైర్పదవికి ఖరారు చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహం ఉందని భావిస్తున్నారు.
ప్రతిపక్ష వైసీపీ అధినేత జగన్ను ఇటు రాష్ట్రంతో పాటు అటు ఇతని సొంత జిల్లా కడపలో కూడా దెబ్బతీయాలన్న లక్ష్యంతో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు... టీటీడీ చైర్మన్ పేరు ఖరారు చేసే విషయంలో వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. మైదుకూరుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డిని తెలుగుదేశం పార్టీలోకి తీసుకొచ్చే క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం సుధాకర్యాదవ్ పేరును ఖరారు చేశారని ప్రచారం జరుగుతోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన రవీంద్రారెడ్డిని టీడీపీలోకి తీసుకురావడం ద్వారా కడప జిల్లాలో జగన్ను వైసీపీని దెబ్బకొట్టొచ్చన్న ఉద్దేశంతో చంద్రబాబు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more