ఇది ర్యాగింగ్ కాదు. వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన లౌడ్ స్పీకర్లు సౌండ్ విషయంలో సీనియర్ విద్యార్థులకు, జూనియర్ విద్యార్థులకు మధ్య రేగిన చిచ్చు. ఈ విషయంలో తలదూర్చినందుకు జూనియర్ విద్యార్థులను సీనియర్ విద్యార్థులు గదుల్లోకి పిలిచి మరీ వారిపై దాడి చేశారు. దీంతో జూనియర్లు తిరగబడ్డారు. అయితే హాస్టల్ లో వుండాల్సిన వార్డెన్లు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించారు. అసలేం జరిగిందో బాహ్య ప్రపంచానికి తెలియకుండా వుండేందుకు శతవిధాలా ప్రయత్నం చేసింది ట్రిఫుల్ ఐటీ యాజమాన్యం.
ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి కఠిన చర్యలు వుంటాయోనన్న విషయాన్ని బయటకు తెలియజెప్పింది. ఈ ఘటనలో ఏకంగా 54 మంది విద్యార్థులకు ప్రమేయం వున్నట్లు స్పష్టం చేసింది. అంతేకాదు.. 54 మందిని మూడు క్యాటగిరీలుగా విభజించి వారికి మూడు రకాలుగా సస్పెషన్లను విధించింది. ఫైనల్ ఇయర్ చదువుతున్న అరుగురు విద్యార్థులను శాశ్వతంగా కాలేజీ నుంచి సస్పెండ్ చేసిన యాజమాన్యం.. మరో క్యాటగిరికి చెందిన 15 మంది విద్యార్థులపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించింది. ఇక మిగిలిన 33 మందిని వారం నుంచి రెండు నెలల పాటు సస్పెన్షన్ విధించింది.
అయితే సస్సెన్షన్ గురైన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని వారని పరీక్షలు రాసేందుకు మాత్రం అనుమతించినట్లు అద్యాపకులు చెప్పారు. అయితే హాజరు పట్టికలో 70శాతం హాజరు లేని పక్షంలో పరీక్షలు రాసేందుకు అనర్హులన్న విషయం తెలిసి కూడా అధికారులు ఇలాంటి దారుణమైన నిర్ణయాలను ఎలా తీసుకున్నారన్నది తల్లిదండ్రుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న. విద్యార్థులు ఘర్షణ పడుతున్న సమయంలో హాస్టల్ స్టాప్ సరిగ్గా విధులు నిర్వహిస్తే.. ఇలాంటి ఘటనలు జరగవని, అయితే వారు నిద్రావస్థలోకి జారుకున్న నేపథ్యంలో ఏకంగా సీనియర్లకు జూనీయర్లకు మద్య పెద్ద ఘర్షణే చోటుచేసుకుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more