తన శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడిన ఆధ్యాత్మిక గురువు డేరా సచ్చా సౌదా ఛీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ కటకటాల వెనక్కి వెళ్లిన తరువాత అయన డేరాలోని సచ్చా లేదన్న వాస్తవాలు బయటకు వస్తున్నాయి. గుర్మిత్ రామ్ రహీమ్ సింగ్ బాబా అరెస్టు తరువాత ఆయన నుంచి ఇన్నాళ్లు బాధలు అనుభవించిన వారు ఒక్కోక్కరుగా మీడియా ముందుకు వస్తున్నారు. ఆయన చేతితో హత్యకు గురైన కుటుంభసభ్యులు న్యాయస్థానం తీర్పును స్వాగతించారు.
కాగా, బాధితుల్లో దేశప్రజల దృష్టిని మాత్రం అకర్షిస్తుంది గురువు దత్తపుత్రిక భర్త వికాస్ గుప్తాతో పాటు గురువు మాజీ అంగరక్షుడు బియంత్ సింగ్. వీరు తెరమీదకు తీసుకువస్తున్న అభియోగాలు నమ్మశక్యంగా లేకపోయినా అవి మాత్రం పక్కా నిజాలని వారు తేల్చిచెబుతున్నారు. దత్త పుత్రిక హనీప్రీత్ సింగ్ ఇశాన్ తో అత్యాచార బాబాకు వున్న సంబంధం బాబు సహా హనీప్రీత్ చెబుతున్నట్టు కాాదని వారిబంధంపై ఆమె భర్త వికాస్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భార్య హనీప్రీత్, బాబా గుర్మీత్ల మధ్య శారీరక సంబంధం ఉందని అరోపించాడు.
దత్తపుత్రిక హనీప్రీత్ తోనూ శృంగారం
హనీప్రీత్ అసలు పేరు ప్రియాంక తనేజా అని అమెతో తనకు 1999లో వివాహం జరిగిందని.. గుర్మీత్ పరిచయమైన తరువాత అమె తనకు దూరమైందని.. 2011లో తన నుంచి విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశానని వికాస్ గుప్తా చెప్పుకోచ్చారు. బాబా నివాసమైన గుఫాలో హనీతో కలసి తాను ఉండేవాడినని.. అక్కడే తన భార్యతో బాబా శృంగారంలో పాల్గొంటూ చిక్కారని.. ఇది గమనించి బాబా విషయం బయటకు పోక్కితే తనను చంపుతానని బెదిరించారని గుప్తా చెప్పారు. అయితే ఈ విషయాలను విడాకుల పిటిషన్ లో కూడా పేర్కొన్నానని చెప్పారు గుప్తా. బాబా అనుచరులు బెదిరించడంతో తాను వేసిన విడాకుల పిటీషన్ కూడా కోర్టు నుంచి ఉపసంహరించుకున్నానని వికాస్ చెప్పారు.
పురుషులను నంపుంసలుగా మార్చిన బాబా
సిర్సాలోని డేరా సచ్చా సౌధాలో గుర్మీత్ రాం రహీం సింగ్ అకృత్యాలు కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితం కాలేదని ఆయన మాజీ బాడీ గార్డ్ బియాంత్ సింగ్ తెలిపారు. డేరా సచ్చా సౌధాలో 600 మంది పురుషులు శాశ్వత ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తుండగా, కొన్ని వేల మంది తాత్కాలిక ప్రాతిపదికన, మరింతమంది అదనంగా స్వచ్చందంగా షిఫ్టులవారీగా పనిచేస్తారని ఆయన తెలిపారు. అయితే వీరందర్లో శాశ్వత ఉద్యోగుల్లో 250 నుంచి 300 మందిని ఆయన పురుషత్వాన్ని కోల్పోయేట్లుగా చేశాడని అరోపించాడు.
ఇది నమ్మలేని నిజమని, డేరా బాబా వద్ద పనిచేస్తూ నపుంసకులుగా, శృంగారానికి పనికిరానివారిగా మారామని తెలుసుకున్న శాశ్వత ఉద్యోగుల్లో కొందరు చేసేది లేక అక్కడే ఉద్యోగాలు చేస్తున్నారని బియాంత్ సింగ్ చెప్పారు. అయితే వీరిని మార్చేందుకు ఆయన పలు మార్గాలను ఎంచుకున్నాడని, కొందరు తమకు అనారోగ్యమని చెబితే వారికి కుని అపరేషన్లు కూడా చేయిండాడని, ఇంకోందరికి వృషణాలను తొలగించారని ఆయన తెలిపారు. డేరా బాబా చేతిలో మోసపోయామని తెలుసుకున్న శాశ్వత ఉద్యోగులు ఉద్యోగాలను కూడా వదిలి వెళ్లిపోయారని ఆయన చెప్పారు. మరికొంత మంది విదేశాలకు వెళ్లిపోయారని బియాంత్ చెప్పారు.
సాద్వీల పాలిట గుఫా పాపకూపం.
సిర్సాలో పితాజీ గుఫాగా పిలిచే గుర్మీత్ అధికారిక నివాసం యువతుల పాలిట ఓ నరకమని, అత్యాచారాలకు గురయ్యే అబలల ఆక్రందనలతో ప్రతిధ్వనించిన పాపకూపమని ఆయన తెలిపారు. భక్తిభావంతో డేరా సచ్చా సౌధాలో చేరి సేవ చేయాలనుకున్న సాధ్వీలను వంతులవారీగా బలవంతంగా అనుభవించాడని ఆయన చెప్పుకొచ్చాడు. 1995-96లో మౌంట్ అబులో గుర్మీత్ సత్సంగ్ నిర్వహించాడని గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా వేసిన క్యాంపులో ఒక టెంటుకు తాను కాపలా కాస్తుండగా, అక్కడికి చేరుకున్న గుర్మీత్ ఒక 16-17 ఏళ్ల అమ్మాయిని పిలిచి, ఆ టెంట్ లోకి ఆ బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడని, ఆ అమ్మాయి ఆర్తనాదాలు తాను స్పష్టంగా విన్నానని చెప్పాడు.
ఇక సిర్సాలోని ప్రధాన ఆశ్రమంలో ఆయన ‘గుహ’ వద్దకు చాలా మంది అమ్మాయిలు వచ్చేవారని, వారిలో ఒక యువతితో డేరాలో రాత్రంతా గడిపేవాడని ఆయన తెలిపారు. దీనిపై గార్డులంతా చర్చించుకునేవారమని ఆయన అన్నారు. అయితే ఇతర గార్డులు అతనిపై భక్తి చూపించేవారు కానీ, తాను కళ్లారా చూడడంతో వారి అభిప్రాయాలతో తాను విభేదించేవాడినని ఆయన తెలిపారు. గుర్మీత్ రేప్ చేసిన ఓ యువతి ఇప్పటికీ డేరాలోనే ఉందని ఆయన తెలిపాడు. కేవలం ఆమె మాత్రమే కాదని, 250 మందికి పైగా అమ్మాయిల్ని రేప్ చేశాడని ఆయన చెప్పారు. 300 మంది సాధ్వీల్లో 90 శాతం మంది అతడి కామదాహానికి బలైనవారేనని ఆయన సంచలన విషయాలను బియాంత్ వెల్లడించారు.
కబ్జా కింగ్ రామ్ రహీమ్.. కన్నేసిన భూమి కావాల్సిందే..
అటు మహిళలే కాదు ఇటు పురుషులపై కూడా తన అడగాలను సాగించిన గుర్మిత్.. అంతటితో అగకుండా భూములను కూడా కబ్జా చేశాడని బియాంత్ అరోపించాడు. తన కన్ను పడిన పడతిని వదలని గుర్మిత్.. అదే తరహాలో తన దృష్టి సోకిన భూమి (ధరణి)ని సొంతం చేసుకునేందుకు అవసరమైతే హత్యలు కూడా చేయించేవాడని బియాంత్ అరోపించాడు. ముందుగా తన గుండాలను పంపించి ఆ స్థలంలో వారి చేత మలమూత్ర విసర్జన చేయించేవాడని చెప్పాడు. దీంతో భూమి యజమానులు ఆ భూములను బాబాకు అమ్మేవారని.. అది కూడా సరసమైన ధరకు కాకుండా.. ఆయనకు ఇష్టమైన ధరకు కొనేవాడని, చెప్పాడు. ఎవరైనా భూమి అమ్మెందుకు ఇష్టపడకపోతే.. భూమిని కబ్జా చేసేవాడని కూడా బియాంత్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more