రాజస్థాన్ లోని జోథ్ పూర్ జిల్లాలో రాజీవ్ గాంధీ నగర్ పోలిస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐకి షాక్ తగిలింది. రెండు లక్షల రూపాలయ లంచం అడిగి.. అందులోంచి లక్ష రూపాయలను లంచంగా తీసుకన్న ఎస్ఐ.. మరో లక్ష రూపాయలు ఇస్తేనే నిందితుడ్ని వదిలిపెడతానని తెగేసి చెప్పాడు. లక్ష రూపాయల డబ్బునే ఎంతో కష్టపడి చుట్టు పక్కల వాళ్లను, బంధువులను అడిగి సమకూర్చాను.. ఇక ఇంతకన్నా డబ్బు తీసుకురావడం తన వల్ల కాదని కన్నీళ్ల పర్యంతమై అర్థించన్న నిందితుడి భార్యను ఒరగా చూసిన ఎస్ఐ.. సరేలా ఎడవమాకు అని ఓదార్చాడు.
అంతేకాదు ‘‘ఈ రోజు రాత్రి మీ ఇంటికి వస్తాను.. నీతో సరదాగా కాసేపు మాట్లాడతాను.. మనం కొంత సమయం ఏకాంతంగా గడుపుదాం.. సరేనా.. ఆ తరువాత మీ భర్థను వదిలిపెడతాను’’ అని ఎస్ఐ చెప్పగానే.. చేసేది లేక ఎస్ఐ ప్రతిపాదనకు తలొగ్గినట్లు సంకేతం ఇచ్చినా.. విలపిస్తూ ఇంటికి చేరకుంది. తానేం చెయ్యాలి.. ఎస్ఐ చెర నుంచి తనను తాను ఎలా కాపాడుకోవాలన్న అలోచన చేసింది. ఇంతలో తనకు వచ్చిన ఓ ఐడియాతో అతని ఆటను కట్టించింది. ఏకంగా రంగంలోకి దిగిన ఏసీబి అధికారులు అమె ఇంటికి వచ్చిన ఎస్ఐని రెడ్ హ్యాండెండ్ గా పట్టుకుని అరెస్టు చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజీవ్ గాంధీ నగర్ లో ఒక వ్యక్తి కిలో నల్లమందు (ఓపియమ్) కలిగి ఉండడంతో అతనిని అరెస్టు చేశారు. భర్తను విడిపించుకునేందుకు వెళ్లిన అతని భార్యను ఎస్సై కమల్ ధన్ చరణ్ 2 లక్షల రూపాయలు డిమాండ్ చేశాడు. లక్ష రూపాయలు ఎలాగోలా సర్దిన ఆమె, మరో లక్షకు చెక్కు రాసి ఇచ్చింది. తన దగ్గర చెక్కులు చెల్లవని, డబ్బే కావాలని కమల్ ధన్ చరణ్ ఆమెకు స్పష్టం చేశాడు. డబ్బు లేదని చెప్పడంతో.. నీతో సరదాగా ఇవాళ రాత్రి గడుపుతాను.. లక్ష రూపాయలు చెల్లిపోతుందని అన్నాడు. అతని ప్రతిపాదనకు సరేనన్న నిందితుడి భార్య.. ఇంటికి చేరకుని అలోచన చేసింది.
నేరుగా ఏసీబి అధికారులను కలిసింది. వారు అమెకు మనోధైర్యాన్ని ఇచ్చారు. ఇక రాత్రి వేళ ఎస్ఐ కలమ్ దన్ చరణ్ తొందరగా డ్యూటీ ముగించుకుని సంబరపడుతూ నిందితుడి ఇంటికి వెళ్లాడు. తలుపు మూసివుండటంతో కాలింగ్ బెల్ నొక్కాడు. తలుపు తెరిచే ఉంది లోనికి రండీ అంటూ సమాధానం రావడంతో సంతోషంగా లోపలికి వచ్చాడు. అక్కడ ఊహించినట్టుగానే అమె చక్కగా ముస్తాబై వుంది. అయితే అమెతో పాటు ఏసీబీ అధికారులు కూడా వుండటంతో కమల్ ధన్ చరన్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. వెంటనే ఏసీబి అధికారులు అతనిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more