సిద్ధిపేట జిల్లా కుకునూర్ పల్లి ఎస్సై ప్రభాకర్ రెడ్డి మరణం ఇంకా మిస్టరీగానే ఉంది. అధికారుల వేధింపుల మూలంగానే సూసైడ్ అని, కాదు హత్య చేశారని ఇలా వాదనలు వినిపిస్తున్న క్రమంలో, హైదరాబాద్ లో చనిపోయిన బ్యూటీషియన్ శిరీష మృతితో లింకు పెట్టేశారు. దీంతో ఈ రెండు కేసుల సంబంధంపై దర్యాప్తు కొనసాగుతోంది. శిరీష్ కాల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, ప్రభాకర్ రెడ్డి, శిరీష మధ్య సంబంధాలు ఉన్నాయని తేలిందని చెబుతున్నారు. ఆదివారం రాత్రి ప్రభాకర్ రెడ్డి హైదరాబాదు వెళ్లాడని, శిరీషపై లైంగిక వేధింపులకు దిగాడని, దీంతో ఆ విషయం బయటకు వస్తే ఉద్యోగం, పరువు పోతుందని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొందరు తోటి ఉద్యోగులు గుసగుసలాడుకుంటున్నారు .
అయితే, ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం ఉన్నతాధికారుల వేధింపుల వల్లే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెబుతున్నారు. తన భర్తకు ఎవరితోనూ సంబంధాలు లేవని, కేవలం కేసును తప్పుదోవపట్టించేందుకు తన భర్తపై ఆరోపణలు చేస్తున్నారని ప్రభాకర్ రెడ్డి భార్య రచన స్పష్టం చేసింది. ఇక శిరీష భర్త ఘటన గురించి వివరిస్తూ... సోమవారం ఉదయం ఆఫీసుకు వెళ్లిన శిరీష రాత్రి 8 గంటల సమయంలో ఫోన్ చేసి లేట్ అవుతుందని చెప్పిందని, 11 గంటల సమయంలో భోజనం చేసి నిద్రపోయామని, అయితే ఉదయం 3 గంటల సమయంలో తను హైదరాబాదుకు 71 కిలో మీటర్ల దూరంలో ఉన్నట్టు లొకేషన్ షేర్ చేసిందని చెబుతున్నాడు. తాను కాల్ చేస్తే ఆమె లిఫ్ట్ చేయలేదని, దీంతో ఆమె నిద్రపోయి ఉంటుందని భావించానని, ఉదయం 5 గంటలకు ఆఫీసుకు వెళ్లిపోయానని చెప్పారు. అనంతరం పోలీసులు ఫోన్ చేసి ఆమె హత్య గురించి చెప్పారని తెలిపారు.
ఈ నేపథ్యంలో పోలీసులు ప్రభాకర్ కు శిరీషతో పరిచయం ఎలా జరిగింది? అన్న విషయంలో ఆమె పని చేసిన సంస్థ అధికారి రాజీవ్, అతని స్నేహితుడు శ్రావణ్ లను ప్రశ్నిస్తున్నారు. రాజీవ్ గర్ల్ ఫ్రెండ్ తేజస్వినిని కూడా విచారించనున్నట్టు తెలుస్తోంది.
ప్రభాకర్ ఆఖరి మాటలు...
‘‘నేను కుకునూర్పల్లిలో పనిచేయలేకపోతున్నాను. హైదరాబాద్ కు బదిలీ చేయించుకుంటాను’’ అని స్నేహితులతో ప్రభాకర్ చెప్పినట్టు తెలుస్తోంది. అధికారుల వేధింపుల వల్లే ప్రభాకర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని కొంత మంది వాదిస్తుండగా, ప్రభాకర్ రెడ్డి మృతదేహం ఫోటోల్లో కనిపిస్తున్న తీరు చూస్తుంటే ఆయనను తుపాకీతో కాల్చి చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మరికొందరు ఆరోపిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more