ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది? ఏళ్ల తరబడి ఈ ప్రశ్నకు ఒకే సమాధానం వినిపిస్తుంటుంది. అదే చైనా. ఏషియా దేశంగానే కాదు ఓవరాల్ ప్రపంచంలోనే సుమారు 137 కోట్లతో అగ్రస్థాయిలో నిలిచింది. ఇక దీని తర్వాతి స్థానే మన భారత్ ఫాలో అవుతూ వస్తోంది. కానీ, గత వారంగా భారత్ చైనాను ఎప్పుడో క్రాస్ చేసి వెళ్లిపోయిందని ఓ సర్వే చెబుతోంది.
చైనాకు చెందిన స్వతంత్ర జనాభా శాస్త్రవేత్త ( డెమోగ్రాఫర్), విస్కాన్సిన్-మాడిసన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త యి ఫుక్సియాన్. చైనా జనాభాను భారత్ ఎప్పుడో దాటేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశాడు. నిజానికి గతేడాది నాటికి చైనా జనాభా 137 కోట్లు అని జాతీయ గణాంకాలు చెబుతున్నాయని, అయితే వాస్తవానికి అంతకంటే ఇంకా 8 కోట్లు తక్కువే అంటే 129 ఉంటుందని వాదిస్తున్నాడు. ఆ లెక్కన భారత అధికారిక గణాంకాల ప్రకారం ఆ దేశ జనాభా 131 కోట్లతో భారతే జనాభాలో అగ్రస్థానంలో ఉంటుందని చెబుతున్నాడు.
ఇక ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్కే ఆ ఖ్యాతి లభిస్తుందని ఫుక్సియాన్ చెబుతున్నారు. కానీ, చైనాకే చెందిన మరికొన్ని సర్వేలు మనోడి వాదనను పెద్ద తప్పుగా పేర్కొన్నాయి. పుక్సి చెబుతున్నట్లు జనాభా క్రమంగా మందగించిన దాంట్లో వాస్తవం ఏ మాత్రం లేదని, అలాగని గణనీయంగా కూడా పెరిగిందనటానికి ఆధారాలు లేవని వాంగ్ ఫెంగ్ అనే మరో డెమోగ్రాఫర్ చెబుతున్నాడు. ఒకే బిడ్డ నినాదం వర్కవుట్ అయినప్పటికీ అది అనుకున్నంత స్థాయిలో కాకపోవటమే ఇందుకు కారణమని వివరిస్తున్నాడు. సరైన గణాంకాల కోసం సీరియస్ గా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్నాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more