రాజస్థాన్ బిజేపి ఎమ్మెల్యేను నెట్ జనులు అపార్థం చేసుకున్నారు. అయితే తన నియోజకవర్గ ప్రజలతో పాటు నెట్ జనులు కూడా ఆయన ఉద్దేశ్యం వెనుకున్న పరమార్థాన్ని గ్రహించడంలో పప్పులో కాలేశారు. అయితే తీరా అయన ఉద్దేశ్యం తెలిసిన తరువాత. ఓహో అదా అసలు విషయం అంటూ నాలుకకర్చుకున్నారు. అసలాయన ఉద్దేశ్యం ఏమిటీ అంటరా..? అంతకన్నా ముందు అయనను అపార్థం చేసుకునేంతలా ఆయన చేసిన పనేంటి అంటారా..? ఏమీ లేదండీ ఇదంతా ఓ సెల్పీ తీసుకుచ్చిన తంటా.
ఔను నిజమే.. రాజస్తాన్ లోని భరత్ పూర్ జిల్లాలోని బయానా అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓ గ్రామంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో నిరుపేదల గుడిసెలు అగ్నికి అహుతవుతున్నాయి. ఈ మేరకు సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆ సమాచారాన్ని పోలీసులతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధి, బీజేపీ ఎమ్మెల్యే బచ్చు సింగ్ కు కూడా తెలియపర్చారు. గుడిసెలు కాలిపోతే తానువచ్చి ఏంచేస్తాను. ముందుగా ఫైర్ సిబ్బందికి సమాచారం అందించండీ అంటూ చెప్పే ప్రజాప్రతినిధులు వున్న నేటి రోజుల్లో.. పేదల గుడిసెలు తగలబడిపోతున్నాయని హుటాహుటిన సంఘటనా స్థలానికి తరలివచ్చిన ఎమ్మెల్యేలు ఎందరుంటారు.
అలా తరలివచ్చే వారిలో ఒకరు ఈ బచ్చుసింగ్. వెంటనే ఘటనాస్థాలానికి చేరుకుని తనకు తొచిన విధంగా తాను కూడా మంటలార్పే చర్యల్లో పాల్గొన్నాడు. సాక్షాత్తు ఎమ్మల్యే కూడా అక్కడే వుండటం.. పేదల బాధలను అర్థం చేసుకోవడంతో.. ఇల్లు, ఇంట్లోని వస్తువులు కాలిపోతున్నా.. వారికి కొంత ధైర్యం వుంటుంది. వారి మనోవేదనను అర్థం చేసుకునేందుకు స్వయంగా తమ ప్రజాప్రతినిధే వచ్చాడని.. ఆయన తమకు న్యాయం అందజేస్తారని అశించారు.
రమారమి మంటలన్నీ అర్పివేత చివరి దశకు చేరుకున్న క్రమంలో బాదితులకు త్వరలోనే తగిన విధంగా నా్యం చేస్తామని, అందరినీ అదుకుంటామని చెప్పిన ఎమ్మెల్యే.. మంటలు కనిపించేలా సెల్ఫీ దిగి తన ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఓపక్క ఇల్లు కాలుతుంటే ఆ అగ్గితో చుట్టవెలిగించుకున్నాడన్న సామెత గుర్తుకొస్తోందని ఒక నెటిజన్ మండిపడగా, ఏ సమయంలో సెల్ఫీ దిగాలో కూడా ప్రజాప్రతినిధికి తెలియదా? అంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక మరికోందరు మాత్రం ఆయనను రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించుకున్న నీరో చక్రవర్తిలా వున్నారని ఎద్దేవా చేశారు. దీంతో ఎమ్మెల్యే బచ్చుసింగ్ తన ఫేస్ బుక్ పోస్టును తొలగించారు. నెట్ జనులు తనను క్షమించాలని తన అసలు ఉద్దేశ్యం తాను స్వయంగా మంటలు చెలరేగి పేదల ఇళ్లను కబళించిన తన నియోజకవర్గంలోని ప్రాంతాను వెళ్లానని, ఆ భాధను, బాధితుల రోదనలను విన్నానని, ఈ క్రమంలో వారిక ిన్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతానని ఇందుకోసమే తాను ఈ సెల్పీని దిగి ఫేస్ బుక్ లో పోస్టు చేశానని చెప్పారు. దీంతో అయ్యయ్యో అనవసరంగా బచ్చుసింగ్ ను అపార్థం చేసుకున్నామే అంటూ కొందరు నెట్ జనులు తమ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more