ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేశ్, అమర్ నాథ్ రెడ్డి, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిలకు చేదు అనుభవం ఏదురైంది. మంత్రులను బాధిత కుటుంబాల సభ్యులు నిలదీసి వెనక్కు వెళ్లమని నినాదాలు చేయడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా మునగలపాళెం గ్రామంలో ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను స్థానికులు అడ్డుకున్నారు.
ఇసుక మాఫియా వెనుక ఉన్నది మీ మనుషులు కాదా? అంటూ మృతుడి భార్య నిలదీశారు. మీరు పది లక్షలు ఇవ్వడం కాదు...అవే పది లక్షల రూపాయలను నేను మీకు ఇస్తాను...నా భర్తను మీరు వెనక్కి తీసుకురండి అని ఆమె సవాలు విసిరారు. గ్రామంలో ఇసుక మాఫియా పేట్రేగిపోతోంది, చర్యలు తీసుకోండి అంటూ పలుమార్లు గ్రామం నుంచి రిప్రజెంటేషన్ ఇస్తే పట్టించుకోలేదని ఆమె మండిపడ్డారు.
న్యాయం చేస్తామని పరామర్శించేందుకు వచ్చిన మీరు...తమ వారిని పొట్టన బెట్టుకుని ఏం న్యాయం చేస్తారని ఆమె అడిగారు. అమరావతిలో రోడ్లేసుకోవడం కాదు...గ్రామాలను కూడా పట్టించుకోండి అంటూ ఆమె నిలదీశారు. అమరావతి, గుంటూరు తప్ప మిగతా ప్రాంతాల అభివృద్ధి పట్టదా అని ప్రశ్నించారు. శ్రీకాళహస్తిలో రోడ్డు విస్తరణ జరిగి ఉంటే ప్రమాదం జరిగేది కాదన్నారు. ‘అమరావతిలో రోడ్డు వేయడం కాదు.. మా సంగతి పట్టించుకోండి’ అంటూ ధ్వజమెత్తారు.
అనంతరం లోకేష్ మాట్లాడుతూ, ఈ గ్రామం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అన్నారు. గ్రామంలో చాలా మంది హైదరాబాదులో ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు చేస్తున్నారని, అలాగే బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారని, వారందర్నీ సంప్రదాయబద్దమైన కర్మకాండలు ముగిసిన తరువాత అమరావతికి రమ్మని పిలిచామని, ఆ తరువాత వారి భవిష్యత్ గురించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. కాగా ఏర్పేడు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 16కు చేరింది. స్విమ్స్ లో చికిత్స పొందుతూ శనివారం మరొకరు మృతి చెందారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more