మందులోకి చికెన్ తక్కువైందని అటవీశాఖ సిబ్బంది తన్నుకున్న ఘటన కర్నూలు జిల్లా అహోబిలంలో చోటుచేసుకుంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే...అహోబిలంలో అటవీశాఖ సిబ్బందికి పార్టీలు చేసుకోవడం సర్వసాధారణమే. ఈ నేపథ్యంలో నేటి ఉదయం కార్యాలయానికి చేరుకున్న అనంతరం పార్టీ చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు చికెన్, మద్యం తెచ్చుకుని తాగడం మొదలుపెట్టారు. అయితే మద్యం సరిపోదని భావించిన సిబ్బందిలో మదారి అనే వ్యక్తి మద్యం తెచ్చేందుకు వెళ్లాడు. ఇంతలో అక్కడున్నవారు చికెన్, మద్యం ఖాళీ చేశారు.
దీంతో మద్యం తీసుకుని వచ్చిన మదారి....తన చికెన్ ఏమైందంటూ సహచరులను నిలదీశారు. ఈ సందర్భంగా మాటామాటా పెరిగింది. ఒకరినొకరు దుర్భాషలాడుకున్నారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మదారి వ్యతిరేక వర్గం అక్కడే ఉన్న బడే (కర్ర) ను తీసుకుని అతని తలపై బలంగా కొట్టాడు. దీంతో మదారి కుప్పకూలిపోయాడు. దీంతో మదారి మరణించాడని భావించిన సిబ్బంది భయంతో పరుగులు తీశారు. ఈ తతంగమంతా సుమారు అర్థగంట పాటు సాగినట్టు తెలుస్తోంది. అంతవరకు బిగ్గరగా దుర్భాషలాడుకుని, ఒకరిపై ఒకరు కలబడి కొట్టుకున్న సిబ్బంది అకస్మాత్తుగా తలుపులు తెరుచుకుని పరుగులు తీయడంతో...ఏం జరిగిందో అర్ధం కాని భక్తులు కూడా పరుగందుకున్నారు.
దీనిపై అహోబిలం అటవీశాఖ రేంజ్ అధికారి రామ్ సింగ్ మాట్లాడుతూ, తాను రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నానని, ఏం జరిగిందో తనకు పూర్తిగా తెలియదని అన్నారు. అయితే అహోబిలంలో జరిగిన సంఘటన తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. ఈ ఘటనలో దాడులు జరిగినట్టు తనకు తెలియదని, మద్యం మత్తు ఎక్కువైన ఒక అధికారిని ఆసుపత్రికి తరలించినట్టు తన దృష్టికి వచ్చిందని ఆయన చెప్పారు. దాడులు జరిగినట్టు తెలిస్తే...శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more