దేశాధ్యక్ష పదవి అంటే తెలుసా..? రాష్ట్రపతి పదవి. ఈ పదవిలో కొనసాగుతున్న ప్రణబ్ ముఖర్జీ పదవి రమారామి మరో ఏడాదిలో కాలంలో ముగియనుండడంతో.. ఈ పదవికి అప్పుడే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందా..? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి. మరో ఏడాది నుంచి ఏడాదిన్నర కాలం దూరంగా వున్న రాష్ట్రపతి ఎన్నికలకు అప్పుడే అభ్యర్థులను ఖరారు చేయాలని, వారిని తెరముందుకు తీసుకువచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పటికే రాష్ట్రపతి పదవి కోసం బీజేపి అగ్రగన్యుడు లాల్ కిషన్ అద్వానీ ఎంతో అశగా ఎదురుచూస్తున్నారని కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపి మిత్రపక్షం శివసేన మాత్రం మరో అభ్యర్థిని తెరమీదకు తీసుకువచ్చింది.
రాష్ట్రపతి పదవికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భగవత్ కూడా తెరపైకి వచ్చింది. ఆయనను రాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా నిలబెట్టాలని శివసేన పార్టీ కొత్త ప్రతిపాదనను అప్పుడే తెరపైకి తీసుకువచ్చింది. మోహన్ భగవత్కు ప్రెసిడెంట్ పదవి కట్టబెట్టాలని శివసేన అభిప్రాయపడి కొత్త చర్చను తెరపైకి తీసుకువచ్చింది. హిందుత్వ నేతగా, ఆర్ఎస్ఎస్ ప్రచారకర్తగా మోహన్ భగవత్కు దేశ ప్రజల్లో మంచి పేరుందని అందుకనే అయన పేరును రాష్ట్రపతి పదవికి గుర్తించాలని ఈ ప్రతిపాదనను శివసేన తీసుకువచ్చిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు.
ఈ మేరకు తాము ఈ ప్రతిపాదనను ప్రధాని నరేంద్రమోడీ ముందుపెట్టదలిచామన్నారు. ఒకనాటి హిందుస్తాన్ గా వున్న భారత్ మళ్లీ అదిశగా పురోమించాలన్నా.. దేశంలో హిందుత్వ రాజ్య స్థాపన జరగాలన్నా భగవత్ రాష్ట్రపతి పదవిని అలకంరించాలని అశాభావం వ్యక్తం చేసింది. ఈ మేరకు సామ్నా పత్రికలో ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దేశంలో అది అత్యున్నత పదవిని ఎటువంటి మచ్చలేని వ్యక్తి అధిరోహించాలని అందుకే తాము ఈ పేరును ప్రతిపాదించామన్నారు. భగవత్ను రాష్ట్రపతి హోదాకు రికమండ్ చేసే అంశాన్ని ఉద్దవ్ థాక్రే చూసుకుంటారని రౌత్ అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more