టాలీవుడ్ అగ్ర నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం తన ట్విట్టర్ లో చేసిన ట్వీట్లు ఆసక్తికర చర్చకు దారితీశాయి. తన తండ్రి స్వతహాగా వామపక్ష భావజాలాలు ఉన్న వ్యక్తి కావటంతో చిన్నప్పటి నుంచే తాను వాటికి ప్రభావితుడిని పవన్ తరచూ పలుసార్లు చెప్పటం మనం చూశాం. ఈ క్రమంలో తరచూ కామ్రేడ్ పార్టీ నేతలతో సమావేశం అయ్యే పవన్ ఓ కీలక నేతకు సంబంధించి తన ట్విట్టర్ లో పేర్కొన్నాడు.
కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి శతజయంతి సందర్భంగా పవన్ ఆయన్ని గుర్తు చేసుకున్నారు. ఇది.. కామ్రేడ్ తరిమెళ్ల నాగిరెడ్డి శత జయంతి సంవత్సరం అని, ఈ సందర్భంగా చిన్నతనంలో జరిగిన ఓ విషయం తనకు గుర్తుకు వస్తోందని చెప్పుకొచ్చాడు. తాను ఇంటర్మీడియట్ చదువుతుండగా, నాగిరెడ్డి రచించిన ‘తాకట్టులో భారతదేశం’ అనే పుస్తకాన్ని తన తండ్రి తనకు ఇచ్చారని, అయితే, ఆ పుస్తకంలో నాగిరెడ్డి ఆలోచనలు, లోతైన అధ్యయనం, గంభీరత ఉండటంతో ఆ వయసులో తాను గ్రహించలేకపోయానని, ఆ పుస్తకంలో రాసిన వాక్యాలు ఇప్పటి పరిస్థితులకు సరిపోతాయని అన్నారు.
మద్రాస్ లెజిస్టేటివ్ లో ఎంపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా నాలుగు సార్లు నాగిరెడ్డి పని చేశారని, భూమి లేని నిరుపేదల కోసం వెయ్యి ఎకరాలను ఆయన దానం చేశారని, అంత గొప్ప వ్యక్తికి తలవంచి నమస్కరిస్తున్నానని ఆ ట్వీట్ లో పవన్ పేర్కొన్నారు. 1917 ఫిబ్రవరి 11న అనంతలో జన్మించిన నాగిరెడ్డి అలియాస్ టీఎన్ మచ్చ లేని నేతగా తన రాజకీయ ప్రస్థానం కొనసాగించాడంటూ ప్రశంసలు కురిపించాడు కూడా. ఇక ఇదిలా ఉంటే చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గుంటూరు - విజయవాడ మధ్య మంగళగిరిలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో సోమవారం చేనేత సంఘాలు నిర్వహిస్తున్న సత్యాగ్రహం కార్యక్రమంలో పవన్ పాల్గొనబోతున్నాడు. చేనేత ఐక్య గర్జన పేరుతో చేపట్టిన సత్యాగ్రహంలో మధ్యాహ్నం 3 గంటల కు పవన్ ప్రసంగించనున్నాడు.
#ComradeTarimelaNagiReddycentenary pic.twitter.com/j2IPI5g0NL
— Pawan Kalyan (@PawanKalyan) February 19, 2017
#ComradeTarimelaNagiReddycentenary pic.twitter.com/iVYOLmEUw5
— Pawan Kalyan (@PawanKalyan) February 19, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more