అసెంబ్లీలో తీవ్ర గందరగోళం, కొట్లాట నడుమే ప్రతిపక్షాలు లేకపోయినా పళనిస్వామి ఏకపక్షంగా విశ్వాస పరీక్షలో గెలిచిన విషయం తెలిసిందే. అయితే అంతకు ముందు తీవ్ర వ్యతిరేకత ఉన్న శశికళ వర్గం గెలుపు సాధించటం చాలా కష్టమని పలువురు తేల్చేశారు కూడా. ఈ నేపథ్యంలో సీఎం కుర్చీ మళ్లీ పన్నీర్ సెల్వంకే దక్కుతుందని చాలా మంది అనుకున్నారు. కానీ, సీన్ రివర్స్ అయ్యంది. మరోపక్క బిహైండ్ ద సీన్ రాజకీయాలతో బీజేపీయే పన్నీర్ ను రెచ్చగొట్టి ఇంత పరిస్థితికి తీసుకొచ్చిందన్న ఓ ప్రధాన ఆరోపణ ఉంది. కానీ, అదే పార్టీకి షాకిస్తూ సొంత నేత, రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి మాత్రం మొదటి నుంచి శశికళ కు మద్దతు పలకటం తీవ్ర చర్చగా మారింది.
అంతెందుకు గతంలో ఎన్నోసార్లు పార్టీ వ్యతిరేక కామెంట్లు చేసిన ఆయన, అసలు అక్రమాస్తుల కేసులో అమ్మను, చిన్నమ్మను కోర్టును లాగిన ఆయనే ఇలా చిన్నమ్మకు మద్ధతుగా మాట్లాడతారని ఎవరూ ఊహించలేదు కూడా. చివరకు ఎమ్మెల్యేల సంతకాలతో ఓ లేఖను గవర్నర్ విద్యాసాగర్ రావుకు సమర్పించిన శశికళకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరిన సమయంలో కూడా, జాప్యం చేస్తే ఏకంగా కోర్టులో పిటిషన్ వేస్తానంటూ స్వామి హెచ్చరించడం విదితమే. మరి ఆయన ఎందుకిలా చేశారు అన్న దానిపై క్లారిటీ ఇవ్వాలిగా... శశికళ విషయంలో ఎందుకంత పట్టుదలగా ఉన్నాననే విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామి తాజాగా చెప్పుకొచ్చారు.
ఆరోపణలు ఉన్నప్పటికీ శశికళ తమిళనాడు రాజకీయాల్లో చాలా బెటర్ అంటూ వ్యాఖ్యానించాడు. ఆమెకు హిందుత్వ భావన ఎక్కువగా ఉందని, ఆమె దేవాలయాలకు వెళతారని, అదే, డీఎంకే వాళ్లు హిందూ వ్యతిరేకులని, ఆలయాలను ధ్వంసం చేస్తారని స్వామి వ్యాఖ్యానించారు. కశ్మీర్ తో పోలిస్తే తమిళనాడు లోనే దేశ ద్రోహులు ఉన్నారంటూ పరోక్షంగా డీఎంకే పై కామెంట్ చేశాడు. డీఎంకే ఓ జాతి, మహిళా వ్యతిరేక పార్టీ. అందుకే ప్రజలు ఇంతకు ముందు ఎన్నికల్లో వారిని ఓడించారు. అందుకే వారికన్నా అవినీతిపరులు ఉండటమే నయమని తాను మద్ధతు ఇచ్చానని ప్రకటించాడు. కాగా, అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో ఆమె అనుచరుడు పళనిస్వామికి మద్దతు ప్రకటించినట్లు ఆయన తెలిపాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more