ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తొలిధశకు ముమ్మర ప్రచారంతో హోరెత్తిస్తున్న అభ్యర్థులు.. గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్న క్రమంలో.. పాపులారిటీ ద్వారానే ఓట్లు పడతాయని తెలుసుకున్న ఓ అబ్యర్థి సంచలన వ్యాఖ్యలు చేసి ఓటర్లను అకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆగ్రా నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటిస్తున్న వ్యక్తి చౌదరి షాకింగ్ ప్రచారంతో వెలుగులోకి వచ్చారు. తాను డబ్బుకోసమే రాజకీయాల్లోకి వచ్చానంటూ బహిరంగంగా ప్రకటించుకోవడం సంచలనంగా మారింది. ఈ అభ్యర్థి చేస్తున్న ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
రాజకీయాల్లోకి ఎందుకు వచ్చారు అన్న మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ.. ఒకటి డబ్బు సంపాదించడం, రెండవది ప్రజల్ని ఫూల్స్ చేయడం అని కుండబద్దలు కోట్టినట్టు చేప్పేశాడు. దాదాపు అందరూ రాజకీయాల్లోకి పరోక్షంగా ఇదే ఉద్దేశంతో వస్తున్నారని కూడా చౌదరి వ్యాఖ్యలు చేశారు. ఒకటవ కారణం కరెక్టే కానీ రెండవ కారణంపై క్లారిటీ ఇవ్వగలరా అన్న మీడియా ప్రశ్నలకు మరో అడుగు ముందుకేసిన చౌదరి ప్రధాన మంత్రి నరేంద్రమోడీపై విమర్శలు ఎక్కుపెట్టారు.
ప్రజల్ని అవివేకుల్ని చేసి ఒక వ్యక్తి దేశాన్నే ఏలుతున్నాడని, అలాంటప్పుడు తాను మాత్రం ఏం తక్కువ అని, తాను కూడా ప్రజలన్ని ఫూల్స్ చేసి ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజలను అవివేకులని చేసిన ఎవరైనా ప్రధాని అయిపోవచ్చని, అందుకోసం కాసింత నైపుణ్యం ఉండాలని పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అలా అని అందరూ ప్రధానులు కాలేరని, దానికి కొంత టాలెంట్ కూడా అవసరమని చౌదరి చెప్పుకోచ్చారు.
#WATCH: Independent candidate Agra South Gopal Chaudhary says 'my only reason for coming into politics is money, I'll fool people" pic.twitter.com/sYfPIdhiYC
— ANI UP (@ANINewsUP) January 27, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more