పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో దేశవ్యాప్తంగా నగదు కొరత, నగదు కోసం ప్రజలు ఇబ్బందులు పడ్డ ఘటనలు అనేకం వెలుగుచూశాయి. ఈ క్రమంలో అనేక మంది బ్యాంకు క్యూ లైన్లలో అసువులు బాసిన ఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీలు అనేకం కేంద్రంతో పాటు ఇటు రిజర్వు బ్యాంకుపై కూడా విమర్శలను సంధించాయి. అయితే ఇప్పుడిప్పుడే ప్రజలకు డిమానిటైజేషన్ ప్రభావం నుంచి కోలుకుంటున్న తరుణంలో రాజస్థాన్ లోని ఒక ఏటీఎం మాత్రం వందలు అడిగితే ఏకంగా వేల రూపాయలను ఇచ్చి షాక్ కు గురిచేసింది.
ఈ విషయం దవానంలో వ్యాపించడంతో సదరు ఏటీయంలో డబ్బులు విత్ డ్రా చేసేందుకు పోటీ పడ్డారు. రాజస్తాన్ రాజధాని జైపూర్ కు సమీపంలోని టాంక్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఏటీఏంలో డబ్బులు డ్రా చేసుకున్న వ్యక్తుల్ని అశ్చర్యానికి గురిచేసింది. దీంతో ఏటిఎం కేంద్రానికి వచ్చిన ప్రజలు హఠాత్తుగా పెద్ద మొత్తంలో డబ్బులు రావడంతో కంగారు పడ్డారు. వెంటనే విషయాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయితే 100 నోట్లకు బదులుగా రెండు వేల నోట్లు జారీ కావడంతో ఈ పరిణామం సంభవించిందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
వివరాల్లోకి వెళితే జితేష్ దివాకర్ ఏటీఎంకు వెళ్లి.. 3500 కావాలని టైప్ చేశాడు. కానీ రూ 3,500 స్థానంలో రూ 70వేలు రావడంతో షాకయ్యాడు. దాదాపు ఇదే అనుభవం మిగిలినవారికి కూడా ఎదురైంది. అయితే ఏటీఎం మిషీన్ లో లోపాన్ని తండ్రి, ఇతర బంధువులకు చేరవేశాడు దివాకర్. వారు బ్యాంక్ మేనేజర్ కు సమాచారం అందించడంతో బ్యాంక్ సిబ్బంది అప్రమత్తయ్యారు. వెంటనే ఏటీఎంను మూసివేశారు. కానీ అప్పటికే రూ.6.76 లక్షలు విత్ డ్రా అయిపోయాయి.
రూ.100 నోట్ల స్లాట్ లో రూ.2 వేల నోట్లను లోడ్ చేయడం వల్ల లోపం తలెత్తిందని బ్యాంక్ ప్రతినిధి హరిశంకర్ మీనా తెలిపారు. కానీ సాధారణంగా ఇలా జరగదనీ, సాంకేతికంగా రూ 100 కేసెట్ లో రూ 2వేల నోట్లు లోడ్ చేయడం సాధ్యం కాదని అందుకే ఈ తప్పిదంపై సాంకేతిక నిపుణులతో సంప్రదించనున్నట్టు తెలిపారు. అలాగే ఏటీఎం మెషీన రికార్డుల అధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. వారి సహకారంతో నగదును ఖాతాదారులనుండి తిరిగి రాబడతామ చెప్పారు. దివాకర్ ఒక్కరే తమకు సమాచారం అందించాడనీ.. మిగిలినవారు అదనపు నగదు తో ఇంటికి వెళ్లి మిన్నకుండిపోయారని మీనా వ్యాఖ్యానించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more