తన కార్యాలయంలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన తరువాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. తన ఇంటిలో ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన అధికారులు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బతికివుంటే ఇంత సాహసానికి కేంద్రం పాల్పడేదా అని మండిపడ్డారు. తన కార్యాలయం, ఇళ్లపై సోదాలు జరిపిన ఘటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. తన కార్యాలయం, ఇంటిపై ఐటీ దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించిందన్నారు. కేంద్రం కూడా కావాలనే దాడులు జరిపిందని అరోపించారు
అమ్మ అకస్మిక మరణంతో తమిళ ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. తన ఇంట్లో ఐటి అధికారులకు లక్షా పన్నెండు వేల రూపాయలతో పాటు తన భాక్యకు చెందిన 40 తులాల బంగారం మాత్రమే లభించాయన్నారు. 25 కేజీల దేవుళ్ల విగ్రహాలు తీసుకున్నారని ఆయన చెప్పారు. తన ఇంట్లో సోదాల నేపథ్యంలో తనను 26 గంటలపాటు హౌస్ అరెస్టు చేసి, సోదాలు నిర్వహించారని ఆయన అన్నారు. తన కుమారుడి పేరుతో సెర్చ్ వారెంట్ ఉంటే, తన నివాసం, ఆఫీసులను తనిఖీ చేసే అధికారం సీఆర్పీఎఫ్ కు అధికారం ఎవరిచ్చారని నిలదీశారు.
ఎవరి అనుమతితో సిఎస్ కార్యాలయంలోకి ఐటి అధికారులు ప్రవేశించారని అడిగారు. తన కుమారుడు వివేక్ పేరు మీద సెర్చ్ వారంట్ తెచ్చి సోదాలు చేశారని, తన కుమారుడు ఏమైనా చీఫ్ సెక్రటిరీయా అన్నారు. తనను లక్ష్యం చేసుకున్నారని, తనకు ప్రాణ హాని ఉందని అన్నారు. తన కుమారుడిని కూడా టార్గెట్ చేశారని అన్నారు. తన కుమారుడి ఇంట్లోకి వెళ్లి తుపాకి గురి పెట్టారని, తన కుమారుడు ఏమైనా నేరస్థుడా అని అన్నారు. తాను శేఖరరెడ్డికి సంబంధించిన ఏ లావాదేవీలోనూ కల్పించుకోలేదని అన్నారు. తన కుమారుడికి అతనితో వ్యాపారలావాదేవీలు లేవన్నారు.
సిఎస్ కార్యాలయంపై దాడులు చేసి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆయన అన్నారు. ఇప్పటికీ తానే చీఫ్ సెక్రటిరీని అని ఆయన అన్నారు. కొత్త సిఎస్ నియామకం చెల్లదని అన్నారు. తనకు ట్రాన్సఫర్ ఆర్డర్స్ ఇచ్చే ధైర్యం కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని ఆయన చెప్పారు. తన కొడుకు పేరు మీద సెర్చ్ వారంట్ తెచ్చి తన కార్యాలయంలో సోదాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. 32 ఏళ్ల పాటు సర్వీసు చేసిన తనకే ఇలా ఉంటే, సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more