తెలుగు రాష్ట్రాల ప్రైవేట్ ట్రావెల్స్ వ్యవహారం కాస్త తీవ్ర ఉద్రిక్తంగా మారింది. తాము నిబంధనలకు అనుగుణంగానే ప్రైవేటు బస్సులను నడుపుతున్నప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం వేధిస్తోందని, అందుకు తగిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని, దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసిన దివాకర్ ట్రావెల్స్ సహ యజమాని, ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మంగళవారం ఉదయం హైదరాబాద్, ఖైరతాబాద్ లోని ఆర్టీయే కార్యాలయానికి రావడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
జేసీ ప్రభాకర్ రెడ్డి సవాల్ ను స్వీకరిస్తున్నామని చెబుతూ, తెలంగాణ ప్రైవేటు ట్రావెల్స్ అసోసియేషన్ ప్రతినిధులను వెంటబెట్టుకుని అప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆర్టీయే కార్యాలయం లోపలికి వెళ్లి వుండటంతో, ప్రభాకర్ రెడ్డిని పోలీసులు బయటే అడ్డుకున్నారు. కొంత వాగ్వాదం అనంతరం ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నామని ప్రకటించి, పోలీసు స్టేషన్ కు తరలించారు. తాము నిబంధనలకు విరుద్ధంగా బస్సులను తిప్పలేదని, తమను వేధిస్తున్నారన్న ఆధారాలు ఉండబట్టే సవాల్ చేశానని, అందుకు ఆధారాలు తీసుకునే వచ్చానని పోలీసు స్టేషన్ దగ్గర ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ తో చర్చించేందుకు వచ్చిన తననెందుకు అడ్డుకుంటున్నారని తెలంగాణ పోలీసులతో తాడిపత్రి ఎమ్మెల్యే, దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రడ్డి వాదనకు దిగారు. ఈ ఉదయం తోపులాటల మధ్య ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషనుకు తరలించారు. ఆరెంజ్ ట్రావెల్స్ యజమాని సునీల్ రెడ్డి బస్సుల సీజ్ వ్యవహారంతో వీరిద్దరి మధ్య మూడు రోజులుగా మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు ముఖాముఖి భేటీకి ఇద్దరూ సై అంటే సై అనుకున్నారు.
ఎవరి వర్షన్ వారిదే...
తనకు ఏ ప్రశ్న వేసినా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని, తనకున్న 44 బస్సుల పర్మిట్లను తీసుకు వచ్చానని, వాటికి టాక్స్ కట్టానో లేదో పరిశీలించుకోవాలని సవాల్ విసిరారు. పాలెంలో ప్రమాదానికి గురైన బస్సు వివరాలూ తన వద్ద ఉన్నాయని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా రాలేదని, తెలంగాణలో బస్సు ఆపరేటర్ గా వచ్చానని, తెలంగాణ చిరునామాతో ఉన్న బస్సు పర్మిట్లను ఆయన చూపించారు.
తెలంగాణ ఆర్జీసీ నష్టపోతుంది...
ఆంధ్ర రాష్ట్రానికి చెందిన బస్సు డ్రైవర్లు హైదరాబాద్ కు వస్తే, వారు సేదదీరేందుకు ఎంజీబీఎస్ లో ఏసీ రూముల సౌకర్యాన్ని తాము దగ్గర చేశామని, తెలంగాణ బస్సులు విజయవాడకు వెళితే, డ్రైవర్లకు కనీసం మంచి నీరు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని టీఆర్ఎస్ నేత శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. ఎన్నో ఏళ్లు కొట్లాడి, ఎందరో ప్రాణాలు కోల్పోయిన తరువాత తాము తెలంగాణను సాధించుకున్నామని, ఇప్పటికీ ఆంధ్రావారి ఆగడాలతో ఇబ్బందులు పడుతున్నామని ఆయన ఆరోపించారు. ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ ఉన్నప్పటికీ, ఏపీ దాన్ని పాటించడం లేదని ఆరోపించారు. సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయడం లేదని అన్నారు. మీడియా మాధ్యమంగా తాను, ప్రభాకర్ రెడ్డిని కూర్చోబెడితే, మొత్తం అన్ని వివరాలనూ చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభాకర్ రెడ్డిని తీసుకువెళ్లిన పోలీస్ స్టేషన్ కు తాను వెళితే, దాడి చేసేందుకు వచ్చారని కొత్త ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాసగౌడ్ అన్నారు.
పాలెం వద్ద యాక్సిడెంట్ అయిన బస్సుకు సంబంధించి ఇంతవరకూ పరిహారం చెల్లించలేదని విమర్శించారు. ఆయన బస్సుల్లో తల నీలాలు వంటి గూడ్స్ సరఫరా సాగుతోందని, వివిధ వస్తు రవాణాకు బస్సులను వినియోగిస్తూ దివాకర్ బస్సులు పట్టుబడ్డాయని కాగితాలు చూపించారు. యాక్సిడెంట్ బస్సులను అంతకుముందే అమ్మేసినట్టు తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారని ఆరోపించారు. 10-10-2010న బస్సును అమ్మేశానని చెబుతూ, 8-12-2010 తేదీ వున్న స్టాంపు పేపర్లపై రాసుకున్నారని ఆ దస్త్రాలు చూపారు. ప్రైవేటు ట్రావెల్స్ మూలంగానే తెలంగాణ ఆర్టీసీకి రోజుకు కోటి రూపాయల నష్టం వస్తోందని, వీటి ఆగడాలను అడ్డుకునే తీరుతామని స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more