ఇరుగుపోరుగు వారి మధ్య చోటుచేసుకునే ఉద్రిక్తతలకు, అసూయ, కక్షకార్పన్యాలకు ఇది పరాకాష్ట. అభం శుభం తెలియని ఓ ఐదేళ్ల చిన్నారిపై పోరిగింటివారు దారుణ పాశవిక చర్యకు పాల్పపడిన ఘటన యావత్ దేశంలో కలకలం రేపుతుంది. దేశఆర్థిక రాజధాని ముంబయిలో జరిగిన ఈ అత్యంత పాశవికమైన చర్యకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి. సెంట్రల్ ముంబైలోని బైకుల్లా ప్రాంతంలో గల న్యూ హింద్ మాదా కాలనీలో 22 అంతస్తుల విఘ్నహర్త అపార్టుమెంట్లోని 15వ అంతస్థులో మహిళా కానిస్టేబుల్ ఆర్తి కుటుంబం నివాసముంటుంది.
ఆర్తి వర్లీ ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండగా అశోక్ మాత్రం ఆటో మొబైల్ వ్యాపారం చూసుకోవడంతోపాటు ఓ షోరూంలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పక్కింటివాళ్లతో అమెకు సోసగకపోవడం కాస్తా ఇబ్బందిగానే వున్నా పెద్దగా పట్టించుకోలేదు. అయితే పక్కింటి వాళ్లు మాత్రం అమెపై తీవ్రస్థాయిలో పగ పెంచుకున్నారు. కక్ష తీర్చుకోవాలని అదనుకోసం ఎదురుచూశారు. సోమవారం ఆర్తి తన ఉద్యోగానికి వెళ్లగా అశోక్ ఇంట్లోనే ఉన్నాడు. గ్లోరియా ప్రి ప్రైమరీ స్కూల్లో చదువుతున్న తమ ఐదేళ్ల పాప బయట ఆడుకుంటోంది.
అమె ఇంట్లో లేని సమయంలో ఇద్దరి ఇళ్లకు కామన్ గా వున్న బాల్కనీ నుంచి కానిస్టుబుల్ ఐదేళ్ల పాపను ఏకంగా 15 అంతస్తులపై నుంచి పొరుగింటి మహిళ విసిరేసింది. కింద పడగానే పెద్ద శబ్దం రావడంతో వెళ్లి చూసిన వాచ్మెన్ షాక్కు గురయ్యాడు. బాలికను ఆస్పత్రికి తరలించినప్పటికీ అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. అయితే, పోరుగింటి మహిళే అ పాశవిక చర్యకు పాల్పడినట్లు అనుమానం వ్యక్తం చేయడంతో అమెను అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు షాక్ గురయ్యారు. పోరుగింటి వారితో పడకపోతే అమాయక బాలిక ఏం చేసిందని.. ఇంత దారుణానికి ఒడిగడతారని స్థానికులు అవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో అపార్టుమెంట్లలో ఉన్నవారందరినీ ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసేలా చేసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more