పెద్ద నోట్లను రద్దు చేయడంతో ప్రజలు పడుతున్న అవస్థలను వ్యవస్థలో లా అండ్ ఆర్డర్ కాపాడుతూ చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. తాము రక్షక భటులం కాదు రా..స భటులం అనే విధంగా వ్యవహరించడం కలకలం రేపుతుంది. ఈ నెల 8న రాత్రి 8 గంటలకు మీడియా ముందుకు వచ్చిన ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన చేసి ఐదు రోజులు గడుస్తున్నా.. అందుబాటులో డబ్బులు లేక, బ్యాంకుల ముందు క్యూ కడుతూ.. ఏటియం చుట్టూ తిరుగుతూ సహనాన్ని కోల్పోవడంలో చిత్రమేమీ లేదు. ఈ క్రమంలో ఎందరో ప్రైవేటు ఉద్యోగులకు 7, 8, 10 తేదీల్లో సాలరీలు వస్తుంటాయి. అటు ఇంటి అద్దెలు, ఇటు పిల్లల ఫీజులు, ఏది సకాలంలో చెల్లించకపోయినా ఇబ్బందులు.. బ్యాంకుల నుంచి రోజుకో పర్యాయం వచ్చే 2 వేల రూపాయలు ఏ మూలకూ చాలక ప్రతిరోజు క్యూ లైన్లో నిలబడి డబ్బును తీసుకోవాలంటూ ఉద్యోగాలకు ఎగనామం పెట్టాలి.
ఇలాంటి పరిస్థితుల్లో సహనం కోల్పోయిన ఓ వ్యక్తి.. తనకు ఎదురవుతున్న భాధను వ్యక్తం చేయడంలో విఫలమయ్యాడు. గత ఐదు రోజులుగా నిత్యం తాను అనుభవిస్తున్న అవస్థలతో సహనం కోల్పోయిన అనంతపురం సాయినగర్ ప్రాంతానికి చెందిన వ్యక్తిని పోలీసులు కిరాతకంగా దాడి చేశారు. విధులు నిర్వహించే పోలీసులే సహనం కోల్పోయి విఛక్షణ రహితంగా దాడి చేసింది చాలక బలవంతంగా జీపు ఎక్కించి స్టేషన్ కు తరలించారు. ఇక స్వామిభక్తిని చాటుకునేందుకు ఓ కానిస్టేబుల్ రెచ్చిపోయాడు. మీరే చూడండీ..
సాయినగర్లోని ఎస్బీఐ బ్యాంకు వద్ద క్యూ లైన్లో లేని ఒక వ్యక్తి సహనం కోల్పోయి ఎస్ఐ జనార్దన్ హెచ్చరించారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన యువకుడు ఎస్ఐపై చేయి చేసుకున్నారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా యువకుడిని చుట్టుముట్టారు. లాఠీలు తీసుకుని ఇష్టానుసారం కొట్టేశారు. ఇద్దరు పోలీసులు యువకుడి చేతులు పట్టుకోగా.. మిగిలిన పోలీసులు లాఠీలతో చితక్కొట్టారు. ఒక కానిస్టేబుల్ యువకుడిని రెండుచేతులతో లాఠీ పట్టుకుని పశువును కొట్టినట్టు కొట్టాడు. నడిరోడ్డు మీదే ఇదంతా జరిగింది.
ఇలా నడిరోడ్డుమీదు కొట్టుకుంటూ ఈడ్చుకెళ్లిన పోలీసులు అతడిని రహస్యప్రదేశానికి తరలించారు. తీసుకెళ్లిన పోలీసులు ఆ యువకుడిని ఏం చేశారో తెలియడం లేదు. ఎస్ఐపై యువకుడు చేయి చేసుకోవడం తప్పే . కానీ అతడిని చట్టప్రకారం శిక్షించాల్సిన పోలీసులు ప్రజలంతా భీతిల్లిపోయేలా నడిరోడ్డుపై పశువును కొట్టినట్టు కొట్టారు. ఈ దాడి దృశ్యాలను కొందరు సెల్ఫోన్లో రికార్డు చేశారు. దాడికి గురైన యువకుడు కడప జిల్లా కమలాపురానికి చెందిన మధుసూదన్ గా గుర్తించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more