అవినీతి సముద్రంలో సోరచేపలను, తిమింగలాలను వదలి చిన్న చేపను పట్టుకుని చెంతాడంత మీడియా కవరేజ్ ఇవ్వడం అవసరమా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నం కావాల్సిన అవసరం మెదలయ్యింది. బీజేపి పాలిత మధ్యప్రదేశ్ లో అవినీతి నిరోధక వ్యవస్థగా వున్న లోకాయుక్త.. ఓ మద్య తరహా కుటుంబానికి చెందిన వ్యక్తి లక్ష్యాధికారి తేలడంతో ఆయన గురించి విపరీతమైన హైఫ్ క్రియేట్ చేయడం అవసరమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఇంతకీ మేం చెబుతున్నదెవరి కోసమో తెలుసుగా..
క్రితం రోజున మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో ఓ పౌరసరఫరా దుకాణంలో పనిచేస్తున్న సురేశ్ ప్రసాద్ పాండే అనే వ్యక్తిని లోకాయుక్తకు చెందిన పోలీసులు అరెస్టు చేశారే అతడి గురించే. అతడు నెల వేతనం రూ.1,200. కానీ అనూహ్యంగా అతడు లక్షాధికారి అయ్యాడని వారు తేల్చారే అతగాడి గురించే. అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని, అతడిపై అనేక పిర్యాదులు అందడంతో తాము అతడి ఇంటిపై దాడులు నిర్వహించగా అతడి సంపాదన కన్నా వందల సార్లు అధికమై అస్తులు బయటపడ్డాయని లోకాయుక్త అధికారులు వెల్లడించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది,
రూ.1200 నెలసరి వేతనంతో అతడు లక్షాధికారి ఎలా అయ్యాడు, అని కూపీ లాగిన లోకాయుక్త పోలీసులు అతడు అక్రమంగా ఆస్తులు కూడబెట్టాడని కూడా తేల్చారు. అయితే అతను కనీసం రేషన్ దుకాణం అలాటీ కూడా కాదు. దీంతో అతను నిత్యవవసర సరుకులను పక్కదారిలో విక్రయించే అవకాశం కూడా లేదు. అయితే అతడు ఎలా అక్రమాస్థులను సంపాదించాడన్న అనుమానాలను మాత్రం లోకాయుక్త వెల్లడించలేదు, దీనికి తోడు అతడి వద్ద ఒక బొలేరో, ఆల్టో కార్లను, యాక్టివా, హోండా షైన్ బైక్ లు కూడా వుండటంతో వాటిని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
అధికారుల సోదాల్లో ఈ విసయాలు బయటపడటంతో దీనికి మీడియా కూడా మంచి ప్రాధాన్యతనే ఇచ్చింది. అయితే సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అవుతూ.. అక్రమంగా పెద్ద పెద్ద అస్తులను కూడబెడుతున్న వారిని వదిలి చిన్న చేపను పట్టకుని పెద్దగా ప్రచారం చేయడంలో లోకాయుక్త అంతర్యమేమిటీ అన్నదే అర్థం కావడం లేదు. బహుశా ఈ ఘటనతో మధ్యప్రదేశ్ సర్కార్ ఇక తాము సామాన్యులు, పేదలను కూడా అక్రమాస్థుల విషయంలో టార్గట్ చేయనున్నామన్న సంకేతాలను ప్రజల్లోకి పంపుతుందా..? ఈ హైప్ తో యావత్ భారతంలోని ప్రజలకూ ఈ సంకేతాలు వెలువడేలా చేసిందా..? అన్న అనుమానాలు కూడా బలపడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more